Tuesday 29 July 2014

ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాల వలన అనర్ధాలు

వినాయక చవితి సమీపిస్తోంది. అందరూ తమ విగ్రహమే అందంగా ఉండాలనే ఆలోచనతో ఒకరిని మించి ఒకరు ఎత్తైన విగ్రహాలు ప్రతిష్టిస్తారు. ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాల వలన కలిగే అనర్ధాలు తెలుసుకుందాం.

§ ప్లాస్టర్-ఆఫ్-పారిస్లో జిప్సం, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నిషియం ఉంటాయి.
§ రసాయన రంగుల్లో మెర్‌క్యూరీ(పాదరసం), కాడ్మియం, లెడ్ మొదలైనవి ఉంటాయి.
§ ఈ రసాయనాలు నీటిలో రసాయనాల మోతాదును పెంచి, నీటిని విషతుల్యం చేస్తాయి.  
§ ఈ క్రమంలో పర్యావరణంలో భాగమైన చేపలు, ఇతర జలచరాలు, మొక్కలు మరణిస్తాయి. ఈ కలుషిత జలాలను త్రాగడం వలన ఈ జలాశయాల క్రింద ఉండే జనం అనేక రోగాల బారిన పడతారు.

§ ప్లాస్టర్-ఆఫ్-పారిస్‌తో చేసిన విగ్రహాలు అందంగా, ఆకర్షణీయంగా, తేలికగా ఉన్నప్పటికి నీటిలో త్వరగా కరగవు. దాదాపు 48 గంటల తరువాత కాని కరగడం మొదలుకావు. ఈ సమయంలో బుల్‌డోజర్లు, ఇతర వాహానాలు వచ్చి విగ్రహాలను ముక్కలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మనం ఎంతోగానే పూజించిన గణపతి విగ్రహం ప్రకృతిలో కలిసిపోకుండా ముక్కలుగా పడి ఉండడం గణపతిని అవమానించడమే అవుతుంది.

సంప్రదాయేతర విగ్రహాలను వాడడం వలన చెరువులు, నదులు, సముద్రాలు, ఇతర నిమజ్జన ప్రదేశాల్లో విష రసాయనాల శాతం పెరుగుతుంది. నీటిలో యాసిడిటి, లోహశాతం పెరుగ్తుంది. ఫలితంగా పర్యావరణం కలుషితమవుతుద్ని. జలచరాలు, నీటిమొక్కలు చాలా మరణిస్తాయి. ప్రజలకు శ్వాససంబంధిత రోగాలు, చర్మ, రక్త, రోగాలు సంక్రమిస్తాయి. ఇది గణపతి తత్వానికి విరుద్ధం.

మట్టి గణపతినే పూజించండి. పర్యావరణాన్ని రక్షించండి. గణపతి పర్యావరణ ప్రేమికుడని మరువకండి.

No comments:

Post a Comment