Thursday 10 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 3

తను విభజించిన వేదాలను తన నలుగురు శిష్యులకు అప్పగించి ప్రచారం చేయించారు. ఎంతో జటిలమైన వేదవిభజన చేయడంతో బ్రహ్మ ఆనందం పొంది మహర్షిని వేదవ్యాస అన్నారు. అందుకే వేదాన్ వ్యస్యతి ఇతి వేదవ్యాసః అంటారు. వేదవ్యాసా! నాకు పుత్రుడివై, వేదాలను విభజించి, నన్ను ఆనందపెట్టవు. ఇలాగే అన్ని మన్వంతరాలలో, ద్వాపరంలో జన్మిస్తూ, వేద విభజన చెయ్యి' అని అపాంతరముడికి విన్నవించాడు బ్రహ్మ. అప్పటి నుంచి ప్రతి మన్వంతరంలో వేదవ్యాసుడు జన్మిస్తున్నాడు. అయితే వేదవ్యాసుడనేది పదవి నామమే అని, వ్యక్తి నామం కాదని చెప్తారు పెద్దలు. మొదట స్వాయంభువ మనవు వేదవ్యాసుడు కాగా, రెండో మన్వంతరంలో ప్రజాపతి, మూడవ మన్వంతరంలో శుక్రుడు వ్యాసులయ్యారు.

వేదవ్యాసునికి బాదరాయణుడు, అపాంతరముడని వ్యవహార నామాలు. ఇప్పటి వ్యాసమహర్షికి కృష్ణద్వైపాయనుడని పేరు. నల్లని వరణం కలిగినవాడు కనుక కృష్ణ అన్నారు, యమునా నదీ ద్వీపంలో ప్రకటితమయ్యాడు కనుక ద్వైపాయనుడన్నారు.

వ్యాసమహర్షి వేద విభజన చేసి ఆపలేదు. లోకులకు వేదసారం త్వరగా అర్దమవ్వాలని పంచమవేదమైన మహాభారత ఇతిహాసాన్ని లిఖించారు. అప్పటికి అర్దం కానివారుంటారని వేదం సులువుగా అర్దమవ్వడం కోసం అనేక మన్వంతరాలలో జరిగిన ఘట్టాలను ఏర్చి, కూర్చి, 18 పురాణాలను, 32 ఉపపురణాలను రచించారు. ఇంకా లోకులకు ఉపకారం చేయాలన్న తపనతో భక్తిని ప్రసాదించే భగవద్ లీలల సమాహారమైన భాగవతాన్ని అందించారు. ఇంత మేలు చేసిన వ్యాసమహర్షికి కృతజ్ఞతగా గురుపూర్ణిమ పేరుతో ప్రజలు తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని, ఆరాధిస్తారు. వ్యాసుడి అంశలేని వారు వేదవేదాంతల బోధ చేయలేరు. ప్రతి గురువులో వ్యాసుడు ఉంటాడు. గురుపూర్ణిమ వ్యాసుని కోసం వచ్చింది. అది వ్యాసపూర్ణిమ. ఆ రోజు తమ తమ గురువులలో వేదావ్యాస మహర్షి చూసుకుని పూజించాలి.

వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికి తపస్సు చేసుకుంటూ దేహంతో ఉన్నారు. బద్రీనాధ్ దగ్గరలో కొందరికి దర్శనమిస్తారు. వేద విభజన చేసాక వ్యాసులవారు హిమాలయ పర్వత గుహలోకి వెళ్ళారు. తరువాత ఆయన సంకల్పం చేత ఒక పెద్ద మంచుచర్య విరిగిపడి, ఆ గుహ ద్వారం మూసుకుపోయింది. వ్యాస మహర్షి దర్శనం ఆదిశంకరాచార్యులవారికి కాశీలో కలిగింది. అటుతర్వాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన భాస్కరాచార్యులవారికి కలిగింది.  

To be continued .................

No comments:

Post a Comment