Thursday 17 July 2014

హిందూ ధర్మం - 99

గాంధార (ఆఫ్ఘనిస్థాన్), పారశీక (పర్షియ) నాగరికతలు కూడా భరతఖండంలో భాగాలే(అప్పడు భారతదేశం ఎంతో విశాలమైనది. స్పహ్స్టంగా ఇప్పుడున్న దేశం అందులో 30% కూడా ఉండదు). ఋగ్వేదంలో సప్తసింధు అనే పదం ఉంది. దాన్ని ఉచ్చారణలో మార్పులు, తేడాల కారణంగా హప్తహిందుగా కొందరు పలికేవారు. సప్త అంటే 7 అని అర్దం, అది హప్తగా మారింది, సప్తభుజి ని ఈ రోజు ఆంగ్లంలో Heptagon అంటున్నాం. అరబ్బుల ద్వారా భారతీయ గణితం, అంకెలు, సంఖ్యా విధానం (numeral system) పశ్చిమ దేశాలను చేరాయి. ఇస్లాం ఒక మతంగా పూర్తిగా రూపాంతరం చెందిన తరువాత, ఇతర దేశాలు, సంస్కృతులపై దండెత్తడం ప్రారభించింది. అందులో భాగంగా పర్షియా మీద దండయాత్ర చేసింది, అంటే ఇప్పటి ఇరాక్ మీద అన్నమాట. ఇస్లాం పర్షియాకు చేరకముందు అక్కడ పూరతనమైన వైదిక సంస్కృతి ఆచరణలో ఉండేది. 100 సంవత్సరాలలో మొత్తం పర్షియా, ఇస్లాం దేశంగా మారిపోయింది. ఇస్లాంను అంగీకరించని అనేకమంది దారుణంగా చంపివేయబడ్డారు. కొందరు ప్రాణభయంతో మతం మార్చుకున్నారు. ఆ సమయంలో పర్షియన్లు, ప్రక్కనే ఉన్న తమ సోదరులు వైదిక సంస్కృతిని ఆచరించడం, కనీసం భరతఖండంలోనైనా వైదిక ధర్మం రక్షించబడుతోందనే సంతోషంతో, తమ దగ్గరున్న హప్తహిందులో, హిందు అనే పదాన్ని ప్రయోగించి, ఇక్కడ ఉంటున్న ప్రజలను హిందువులంటూ ఒక గుర్తింపునిచ్చారు. తొలిసారి ఇక్కడే హిందు అనే పదం ప్రయోగించబడిందని కొందరి వాదన.

క్రీ.శ.1000 వరకు ఆఫ్ఘనిస్థాన్‌లో సనాతన ధర్మమే ఉందనడంలో ఎటువంటి సందేహంలేదు. అటు తర్వాత ముస్లిం రాజులు గాంధార చేరుకున్నారు. ఈ ప్రాంతంలో అద్భుతమైన పర్వతశ్రేణి ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందువుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. వారిని అనేక వక్రమార్గాల ద్వారా ఓడించి, వైదిక సంస్కృతిని అణిచివేశారు. హెరాత్ అనే ప్రాంతంపై ఈ మూకుల దాడి కారణంగా 15 లక్షల మంది కనిపించకుండా పోయారని అఫ్ఘన్ చరిత్రకారుడు నమోదు చేశారు. ఎంతో దారుణంగా అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. మతం మారనివారిని బానిసలుగా తీసుకుని పోయారు. చిన్న పిల్లలను బానిసత్వం కోసం తరలిస్తూ ఉండగా, అనేకమంది చలి తట్టుకోలేక మరణించారు. హిందువులపై ఈ ప్రాంతంలో జరిగిన అరచకానికి గుర్తుగా, ఇక్కడున్న పర్వతశ్రేణులకు హిందుకుష్ అనే పేరు వచ్చింది. హిందుకుష్ అంటే పర్షియ భాషలో హిందువుల అణిచివేత, నరికివేత అని అర్దం. చరిత్రలో విజయం సాధించినవారు తమ పేరు మీద ప్రాంతాలకు గుర్తింపునిస్తే, హిందుకుష్ పర్వతాలు మాత్రమే అణిచివేయబడ్డవారి జ్ఞాపకంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాయి. ఒకవేళ మనకు పరాయి మతస్థులు హిందు అనే శబ్దం ప్రయోగించి ఉంటే, సింధు నదిని దాటకముందే, హిందుకుష్ అనే పదం ఉద్భవించింది. అంటే హిందు అన్న పదం పరాయిపాలనకు ముందు నుంచే ఉన్నదని స్పష్టమవుతోంది.

To be continued ....................

No comments:

Post a Comment