Friday 4 July 2014

హిందూ ధర్మం - 97

18వ శతాబ్దంలో థాయి రాజ్యంపై మయన్మార్ (బర్మా) దండయాత్ర చేసి, రాజుని పదవీభ్రష్టుడిని చేసింది. దాంతో అప్పటి వరకు ఉన్న అమూల్యమైన రచనలు నశించాయి. తర్వాత బ్యాంకాక్‌కు రాజధాని మార్చిన రాజు రామ, ముందు చేసిన పని రాంకీన్ (అంటే రామ్యాణాన్ని) తిరిగి రచించమన్నారు. రాంకీన్‌కు సంబంధించిన కొన్ని పెయింటిగులను ఈ రోజుకీ మనం బ్యాంకాక్‌లో చూడవచ్చు. అనేక చోట్ల రాంకీన్ రచనలోని విగ్రహాలు కనిపిస్తాయి. ఆఖరికి ధాయిల్యాండ్‌లో ప్రసిద్ధమైన కిక్‌బాక్సింగ్ కూడా రామాయణంలోని వాలి, సుగ్రీవులు సేనాబలాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసుకున్నారట. ఇప్పుడది అంతర్జాతీయ ఒలంపిక్స్‌లో ఆడుతున్నారు. ఈ ఉదాహరణ ఒక్క ధాయిల్యాండ్‌పై సనాతనధర్మం యొక్క ప్రభావాన్ని చూపిస్తోంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే థాయిల్యాండ్ జాతీయ గ్రంధం రాంకీన్ (రామాయణం).

మహాభారతంలో దృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి పేరు మీద వచ్చిన నగరం గాంధార నగరం. కాలక్రమంలో గాంధహార్‌గా, అటు తర్వాత ఖందహార్‌గా మారింది. ఇప్పుడది ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంది. ఇండోనేషియా దగ్గరలో బాలి అనే దేశం ఉంది. ఆ పేరు బలి చక్రవర్తి నుంచి తీసుకున్నారు. బాలి గురించి హిందువులు చెప్పుకోదగ్గ అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి అక్కడున్న హిందూ జనాభా భారతలో ఉన్న హిందుజనాభా నిష్పత్తికంటే అధికం. రెండవది బాలిలో అనేక తాళపత్ర గ్రంధాలు లభ్యమవుతున్నాయి. బాలీనీస్ బాష కూడా మలయాళం, సింహలీస్ (శ్రీ లంక) భాషలకు దగ్గరగా ఉంటుంది. కాంబోజ రాజ్య కంబోడియాగా మారింది.

రామయాణంలో యావకోటి అనే ద్వీపాల గురించి ప్రస్తావన ఉంది. యావద్వీపానికి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తన సేనలను పంపించాడు. యావ అంటే బార్లీ మొక్కజొన్న అని, ద్వీపం అంటే ఆంగ్ల భాషలో ఐల్యాండ్ అని అర్దం, వేల ఏళ్ళ క్రమంలో యావద్వీపం, జావాద్వీపంగా, ఇప్పుడు జావాగా మరింది. ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో జావ అనే దేశం ఉంది. దాని పేరు కూడా సనాతన సంస్కృతి నుంచే వచ్చింది. అదే రామాయణం బర్మాలో వెండి గనులు ఉన్నాయని చెప్పింది. ఆ మాట యధార్దమని ఈ రోజు ప్రపంచం అంగీకరిస్తోంది.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, ఒకటరెండా, సనాతన ధర్మం యొక్క ప్రభావం ప్రపంచనాగరికతపై కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉంది.

To be continued ............

1 comment: