Saturday 19 July 2014

హిందూ ధర్మం - 101 (ఎవరు హిందువు?)

హిందు అన్న పదం విష్ణు, పద్మ పురాణాలు, బృహస్పతి సంహితలోని ఒక శ్లోకం లో ప్రముఖంగా కనిపిస్తుంది. కొందరు ఈ శ్లోకం విష్ణు పురాణంలోనిదని, కొందరు పద్మపురాణంలోనిదని, కొందరు బృహస్పతి సంహితలోనిదని అంటారు.

ఆసింధో సింధు పర్యంతా యస్యభారత భూమికా
మాతృభూః పితృభూఃశ్చైవ తవైర్ హిందూరితీస్మృతిః

సప్తసింధు ప్రదేశం నుంచి, హిందూమహాసముద్రవరకు వ్యాపించియున్న భారతభూమిని ఎవరు తమ మాతృభూమిగా, పితృభూమిగా భావిస్తారో, ఇక్కడే నుంచే మా పితృదేవతలు ముక్తి పొందారు, ఈ భూమి నుంచే లోకానికి జ్ఞానజ్యోతి ప్రసరించింది, ఇక్కడి నుంచే విశ్వశాంతికి సంబంధించిన సందేశం వెలువడింది, వెలువడుతుందని గట్టిగా నమ్ముతారో, వారంతా హిందువులే అంటున్నది పై శ్లోకం. వారు ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ పెరిగినా, పై విధమైన ఆలోచన ఉన్నవారంతా హిందువులే.

ఎవరు ఓంకారాన్ని శబ్దబ్రహ్మంగా భావించి ధ్యానం చేసేవారు, ఓంకారమే ఆది అని నమ్మేవారు, కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు, ఆవును గోమాతగా గౌరవించేవారు, భారతభూమి యందు భక్తి కలిగి ఉన్నవారు, చెడును విసర్జిస్తారో, అటువంటి వారు మాత్రమే హిందువు అని చెప్పుకోవడానికి అర్హత కలిగి ఉంటారని మాధవ దిగ్విజయ స్వామి పేర్కొన్నారు.

అల్పమైనవాటిని, చెడును, హింసను, పాపాన్ని విడిచిపెట్టేవారు, వేదాన్ని, గోమాతను పవిత్రంగా భావించేవారంతా హిందువులవుతారని వృద్ధ సంహిత అంటున్నది. సంస్కృత సాహిత్యానికి చెందిన కల్కిపురాణం, భవిష్యపురాణం, అద్భుతకోశం, మేధీని కోశం, రామకోశంలో హిందు పదం కనిపిస్తుంది. కాళీదాసుకు చెందిన ఒకానొక కావ్యంలో హైందవ అన్నపదానికి వ్యుత్పత్తి కనిపిస్తుంది. 1352లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహరరాయులు, బుక్కరాయలలో, హరిహరరాయల వారు ఎంతో గర్వంగా తన బిరుదు నామంలో హిందు అన్నపదాన్ని వాడి, హిందురాయ సురత్రాన గా కీర్తింపబడ్డారు.

To be continued ................

No comments:

Post a Comment