Wednesday 16 July 2014

హిందూ ధర్మం - 98

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రపంచదేశాల మీద తన ప్రభావాన్ని చూపిన సనాతన సంస్కృతి తనకు ఒక పేరు పెట్టుకోలేకపోయిందని కొందరు కుహనా చరిత్రకారులు వాదిస్తున్నారు.

మొదటిసారి పర్షియా నుంచి ఇస్లాం రాజులు దండయాత్రలకు వచ్చినప్పుడు సిందూ నది అవతల ఉన్న ఈ ప్రదేశాన్ని గుర్తించారని, తమ భాషలో స్ అని శబ్దం, స, ష అనే పదాలు లేక సిందూనదికి ఆవలి ఉన్న ప్రాంతాన్ని హిందూ అన్నారని ఆంగ్లేయ చరిత్రకారులు రాశారు. అంతేకాదు, ఈ సంస్కృతి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చుకోలేకపోయిందని చెప్పారు. ఇంకొక విషయం హిందు అంటే చోర్, దొంగ అనే అర్ధాలు వారి భాషలో ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంత అబద్దమో చూడండి. వారి వాదనలో ఏ మాత్రం తర్కం (logic) లేదు.

ఒకవేళ పర్షియన్లకు 'స'/ 'ష' / S అనే అక్షరం లేకపోతే, ఆ అక్షరానికి బదులుగా వారు హ/H పలికి ఉంటే, వాళ్ళదేశం పర్షియాకు బదులుగా పర్హియా అయ్యేది. కాదంటారా? వాళ్ళ భాషలోనే ఆయా పదాలు ఉన్నాయి. కనుక ఈ వాదనలో పసలేదు. ఆ సమయంలో భారత్ సుసంపన్నమైన దేశం. అని రంగాలలో అద్భుతంగా రాణిస్తున్న దేశం. చరిత్ర పరిశీలిస్తే, మెగాస్తీనిస్ అనే విదేశీయాత్రికుడు, గ్రీకు దేశస్థుడు, తన పుస్తకమైన ఇండికాలో 'నేను అబద్దం చెప్పిన హిందువును చూడలేదు. హిందువులు ఎంతో నిజాయతీపరులు' అని రాశారు. ఆయన క్రీ.పూ.350 కి చెందినవాడు. ఇట్లాగే అనేకమని హిందువుల గొప్పతనం గురించి తమ తమ గ్రంధాల్లో రాసుకున్నారు. 150 ఏళ్ళ క్రితం మెకాలే బ్రీటిష్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ, నేను భారతదేశం మొత్తం తిరిగాను, కానీ అబద్దం చెప్పేవాడు, మోసగాడు, బిచ్చగాడు, దొంగైనవాడు నాకు ఒక్కడు కూడా కనపడలేదు. ఎంతో గొప్ప విలువలున్న సమాజం హిందువులది అని చెప్పినమాటలు ఇప్పటికి బ్రీటిష్ రికార్డుల్లో చూడవచ్చు. 2,000 ఏళ్ళ క్రితం నుంచి, మొన్నటివారుకు భారతదేశాన్ని సందర్శించినవారు మెచ్చుకుంటే, చోరులను ఒక దేశస్థులకు పేరు ఎలా పెట్టగలరు?

ఆ కాలంలో తమ మతాన్ని అంగీకరించని వారినందరిని బానిసలుగా చేసుకుని, ఊచకోతలు కోసి, మతప్రచారం సాగించారు విదేశీయులు. రాజ్యాలను రక్తపాతం మీద స్థాపించారు. అందులో భాగంగా తొలిసారి అరబ్బులు హిందూ అన్నపదాన్ని వాడారని కొందరి వాదన. వారి ప్రకారం హిందూ అంటే నల్లనివారు, బానిసలు అని, ఇంకా అనేకానేక అర్ధాలున్నాయని చెప్తారు. కానీ ఇది కూడా సత్యం కాదు.

To be continued ..............

No comments:

Post a Comment