Saturday 11 April 2015

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు.

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?
"నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో నేనొక గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామంలో హిందూ-ముస్లిం సమస్య ఉండేది కాదు. మా మొహర్రం ఉత్సవంలో హిందువులు పాల్గోనేవాళ్ళు. హోలీ, దీపావళి పండగలలో మేమూ పాల్గోనేవాళ్ళం. కాలేజీ చదువు కోసం నేను పట్నం వచ్చేను. పేదవాణ్ణి కాబట్టి ఒక మురికివాడలో ఉండేవాణ్ణి. అక్కడ కూడా నాకు హిందూ-ముస్లిం సమస్య కనబడలేదు.

"స్వరాజ్యం వచ్చిన తరువాతే హిందూ-ముస్లింల సమస్య ఇంతగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి? ముస్లింల వద్దకి వివిధ రకాల హిందూ రాజకీయ నేతలు వచ్చి ఏం చెబుతున్నారు? ముస్లింల అస్తిత్వం నేడు ప్రమాదంలో పడిందనీ, మెజారిటీ సమాజం వారిని కబలించి వేస్తుందనీ, తమ పార్టీలు మాత్రేమే వారిని కాపాడగలదనీ, కనుక తమకే వోటు వేయందనీ చెబుతున్నారు.

"ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ముస్లింల 30 శాతం ప్రత్యేక అధికారం కల్పిస్తామంటే, వేరొకరు 50 శాతం ప్రత్యేక అధికారాలు కల్పిస్తామంటారు. అధికార దాహంతో అన్ని పార్టీల హిందూ నేతలూ ముస్లిం వోట్ల కోసం, ముస్లింలకు తమ పార్టీనే ఎక్కువ సదుపాయాలూ కలగజేస్తుందని పోటీపడి మా ముందు జుట్లు పట్టుకుంటూ ఉంటే, మేము (ముస్లింలు) అమాయకంగా మాకు ప్రత్యక అధికారాలు వద్దు మేము జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతాం అని చెప్పమంటారా? ఎందుకు కలిసిపోవాలి? ముస్లిమ్లకేమన్నా పిచ్చా?

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవాలంటే ముందు అధికార దాహం కల రాజకీయ నాయకులను సరిచేయండి. వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకురండి. ఈ రాజకీయ నేతలే నేడు ప్రధాన జీవన స్రవంతిలో లేరు. వారిలో అధికార దాహం మాత్రమే ఉంది. అధికారం కోసం వాళ్ళు దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులు సరైన రీతిలో మారితే ఒక్క సంవత్సరంలోనే ముస్లింలంతా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కాగలరు అని నేను వాగ్దానం చేస్తున్నాను."

ఇవి జస్టిస్ ముర్తాజా గారు చెప్పిన మాటలు. ఇవి నూటికి నోరు పాళ్ళూ నిజం కూడా.

అయితే నాకొక సందేహం. పార్శీలు బయటి నుంచి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన పాలకులు ముస్లింలు, క్రైస్తవుల లాగే పార్శీలకు కూడా మైనారిటీలుగా హోదా ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇస్తామంటే దానిని పార్శీలు తిరస్కరించేరు. ఈ దేశంలో ఆశ్రయం పొందిన తాము ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపునూ పొందాలనుకోవటంలేదనీ, ఈ జాతి ప్రధాన జీవన స్రవంతిలో తామూ భాగస్వాములుగా కొనసాగుతామనీ అన్నారు. జంషెడ్ జీ టాటా, రతన్ టాటా వంటి వారు ఎందరో పారశీకులే. వారు పారిశ్రామికంగా దేశాభివృద్ధికి అందించిన సేవలు ఎవరూ మరచిపోలేనివి. మరి ముస్లింలు పార్శీల వలె ఎందుకు మైనారిటీ సౌకర్యాలను తిరస్కరించరు? జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు? దీనికి బాధ్యులు ఒక్క హిందూ రాజకీయ నాయకులేనా? ముస్లిం నాయకులు, మత పెద్దలు ఇందుకు బాధ్యులు కారా? వారు తమ స్వార్థం కోసం సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలో కలవకుండా వేరు చేయటం లేదా? దేశంలోని మతపరమైన కల్లోలాలకు వారు కూడా కారణం కాదా?

Source: రాజసులోచనం 

4 comments:

  1. కొన్ని దశాబ్దాల క్రితం అడగాల్సిన చాలా మంచి ప్రశ్న ఇవ్వాళ వేశారు!
    ఈ ప్రశ్న రాకముందే ద్విజాతి సిధ్ధాంతం పుట్టి దేశం చీలిపోయింది గదా?

    ReplyDelete
    Replies
    1. అప్పుడు ఇదే ప్రశ్నను అరబిందో, సావర్కర్ వంటి వారు 20 వ శతాబ్దంలో తొలి 2 దశాబ్దాల్లోనే వేశారండి, ఒక వేళ హిందూ-ముస్లింల మధ్య చీలికను కాంగ్రెస్ పూడ్చకపోతే, కాంగ్రెస్ విభజన రాజకీయాల వలన దేశం ముక్కలైనా ఆశ్చర్యపోనవసరంలేదని శ్రీ అరబిందో ఘోష్ గారు చెప్పారు, కానీ వారి మాట వినకపోగా, వారిని కాంగ్రెస్ నుంచి వెళ్ళగొట్టారు అప్పటి కాంగెస్ నాయకులు.

      Delete
  2. Replies
    1. ఇదే ప్రశ్న మన రాజకీయనాయకులను అడగాలండి

      Delete