Monday 27 April 2015

భూమాత అరోగ్యమే మన ఆరోగ్యం - భవిష్యత్తు మన చేతుల్లోనే

యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అని శాస్త్రం అంటుంది. అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్దం. పిండాండం అనగా ఈ శరీరం ................ ఒకే పదార్ధం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. దానిలో భాగమే ఈ భూగోళం, భూమి నుంచి వచ్చిదే ఈ దేహం. శరీరం భూమిలో భాగం. అదీగాకా హిందు ధర్మం ప్రకారం భూమి జీవం లేని మట్టి ముద్ద కాదు. భూమిలో జీవం ఉంది, శక్తి ఉంది, సర్వజీవులకు పుష్టినిచ్చే శక్తి ఉంది. శక్తి ఉంటే ఆమెను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెపచ్చు, రోగాలను నయం చేసుకోవచ్చు. మనకులాగా భూమికి ప్రాణం ఉంది. అందుకే ఆవిడను భూమాత అన్నారు. మనకున్న శరీరంలానే, ఆవిడకు ఒక శరీరం ఉంది. అదే భూమి. మనకు శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నట్లే, భూమాతకు ఉంది. రకరకాల మార్పుల ద్వార ఆవిడ తనలో కలిగిన దోషాలను తొలగించుకుంటుంది.

మనిషికి పంచకోశాలు ఉన్నట్లే భూమాతకు పంచకోశాలున్నాయి. ప్రాణమయకోశంలో దోషాలు ఏర్పడప్పుడు వ్యక్తికి స్థూలసరీరంలో రోగాలు సంభవిస్తాయి. అట్లాగే భూమాతకు ప్రాణమయకోశంలో దోషం ఏర్పడితే అవిడకు రోగలు వస్తాయి. భూమాతకు ప్రాణమయకోశం వాతావరణమే. భూవాతవారణం చెడిపోయిన కారణంగా ఆవిడ స్థూలశరీరంలో అనారోగ్యం సంభవిస్తోంది. దాని ఫలితమే తరచూ సంభవించే ప్రకృతి ఉపద్రవాలు.

మానవుడి మనోమయకోశంలో దోషాల కారణంగా మానసిక సమస్యలు ఏర్పడతాయి. భూమాతకు అంతే. ఇది మరచిన మానవుడు ఈ రోజు రకరకాల చర్యలతో భూవాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. అనగా భూమాత ప్రాణమయకోశాన్ని కలుషితం చేస్తున్నాడు. హింస, క్రూర ఆలోచనల ద్వారా మనోమయ కోశాన్ని పాడు చేస్తున్నాడు. వాటి కారణం చేతనే మానవుడు ప్రకృతి విలయాలకు అతలాకుతలమవుతున్నాడు .......................

భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం భూమాత గర్భంలో ఉన్నాం. భూమికి ఏం జరిగినా, అది నేరుగా మన మీదే ప్రభావం చూపిస్తుంది. కనుక మనం సుఖంగా ఉండాలన్న, మన భూతల్లి సుఖంగా ఉండాలన్న భూమాతపట్ల మానవ దృక్పధంలో మార్పు రావాలి. భూమిలో ఉన్న అమ్మను గుర్తించాలి, ఆవిడకు హాని చేసే చర్యలను మానుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. సర్వమానవాళి అమ్మ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా నడుచుకోవాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

No comments:

Post a Comment