Thursday 5 February 2015

హిందూ ధర్మం - 139 (జలగర్భ ద్వారక పై పరిశోధనలు)

ద్వారక గురించి ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన కధనం చూడండి - ద్వారక వెలికితీతలో భాగంగా పరిశోధకులు 100 నుంచి 140 కిలోల బరువైన బండరాళ్లు చాలా గుర్తించారు. ఇవి ప్రముఖ వ్యక్తుల ఇంటి గోడలకు ఉపయోగించిన బండరాళ్లుగా గుర్తించారు. పడవలకు పెద్దపెద్ద నౌకలకు ఉపయోగించిన కలప శిధిలాలు కూడా లభించాయి. ద్వారకనే పూర్వకాలంలో మంచి నౌకా తీరంగా సైతం వుండేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇవే గాక వేలకొద్ది రాతి ఇటుకలు లభించాయి.

ఆ కాలంలో శత్రువులు దాడి చేసినపుడు తమను తాము రక్షించు కోవడానికి రాతి ఇటుకలను వాడేవారని డాక్టర్‌ ఎస్సార్‌రావు అంటున్నారు. ఈ నగరం గోమతి నది దాకా విస్తరించి ఉన్న పెద్ద నగరంగా ఉండేది. నీటిలో సైతం పూర్తిగా శిధిలం కాని కొన్ని రాతి గోడలు కలిగిన నిర్మాణాలు ఇళ్లూ బయటపడ్డాయి. ఇవేకాక వెండి కంచు ఇత్తడి పాత్రలు సైతం లభించాయి. సముద్ర జిల్లాల్లో ఇంకా క్రిందికి అంటే ఐదు మీటర్ల క్రింద జరిపిన తవ్వకాల్లో ఒక గొప్ప నిర్మాణాన్ని కనుగొన్నారు. దాదాపు అర ఎకరం స్థలంలో ఈ నిర్మాణం వుంది. లోపల ఎన్నో గదులు ఉన్నట్లు గుర్తుగా గోడలు కనుపించాయి. అందులో కంచు గంటలు విల్లుకు మధ్యన ఉపయోగించే వెండి పట్టాలు కనిపించాయి.

ద్వారరకు నాలుగు కిలోమీటర్ల పొడవైన నౌకాశ్రమం ఉండేది. నౌకాశ్రయం ఉన్న ట్లుగా భావిస్తున్న ప్రాంతంలో నలు వైపుల చిన్న చిన్న గృహ నిర్మాణాలు ఉన్నట్లు కనుగొన్నారు. నౌకలకు సంధించిన శ్రామికులు ఈ ఇళ్లలో నివసించేవారని ఊహిస్తు న్నారు. ఇంకా ఈ ద్వారక నగరం గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆశ్చర్యం గొలిపే వస్తువులు లభించినా భద్రతా కారణాల వల్ల వాటి వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. పదిమందిదాకా యువకులను ఎంపిక చేసి పురావస్తు పరిశోధనలో తర్ఫీదు ఇచ్చి సముద్రంలో రెండు గంటల పాటు నిరవధికంగా ఉండగలిగేటట్టుగా వీళ్లకి శిక్షణ ఇచ్చారు. సముద్ర జలాల్లో అవసరమైన ప్రాణవాయువును కొన్ని ప్రత్యేకమైన సిలిండర్లలొ నింపి వీరు తమతోపాటు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ద్వారక నగరంలోని శ్రీకృష్ణుడు నివసించిన భవనాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఒకానొక ప్రదేశంలో ఆధునిక మైన నిర్మాణాలతో ఒక కట్టడాన్ని కనుగొన్నారు. ఈ కట్టడం లోని శిధిలమైన రాతిగోడల మధ్య కిటికీలు ద్వార బంధాలు గడపలు కనుగొన్నారు. ఇందులోని కొన్ని శిధిల భాగాలను పైకి తెచ్చి వీటిపై కార్బన్‌ పరీక్షలు చేయడం ప్రారంభమైంది. దీనినే కార్బన్‌ డేటింగ్‌ టెక్నిక్‌ అంటారు. కిటికీలు చాలా పెద్ద విగా సముద్రపు గాలులు వీచేలాగా నిర్మాణాలు ఉన్నాయనీ ఇళ్లలోనే స్నానపు గదులను సైతం కనుగొన్నారని తెలియవస్తోంది. ఈ నగరం సౌరాష్ట్రకు ముఖ్య పట్టణంగా వుండేదనీ, మన పురాణాల్లో ప్రస్తావించబడిన శ్రీకృష్ణుడు ఈ ద్వారక వీధుల్లో సంచారించాడని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రతి శుక్రవారం పూజించే నారాయణదేవాలయాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. ఈ మూర్తిని మహాభారత కాలంలో సముద్ర నారాయణుడని అనేవారు.

శ్రీకృష్ణుడు ద్వారక నగరనిర్మాణం తర్వాత ఈ నగరంలో 36 సంవత్సరాలు నిర్మించాడు. మహాభారతయుద్ధ కాలంలో శ్రీకృష్ణు డూ అతని అంత:పురంలో రుక్మిణీ సత్యభామలతో సహా ఈ నగరం లోనే నివసించాడు. మా పరిశోధనలు సఫలమైతే శ్రీకృష్ణుడు తిరుగా డిన ద్వారకను ఆయన నివసించిన గృహాన్ని కనుగొనగలం అనే ఆశాభావాన్ని ఎస్సార్‌ రావు వ్యక్తం చేస్తున్నారు.

సేకరణ: (http://www.prabhanews.com/tradition/article-412447)

To be continued ..............

No comments:

Post a Comment