Monday 9 February 2015

హిందూ ధర్మం - 143

క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు. వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.

ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ గ్రహగతులను లెక్కించి చరిత్రలో మహాభారత కాలాన్ని లెక్కించారు. మహాభారత కాలాన్ని లెక్కించడంలో ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు, అత్యాధునిక కార్బన్ డేటింగ్ పద్ధతి మొదలైనవి ఒకదానితో ఒకటి సరిపోతున్నాయి.

ఇదిఅదే కాక, ఆదిశంకరుల విషయంలో దొరికిన శాసనం బ్రిటిషర్లు లెక్క కట్టిన ఆదిశంకరుల జీవించిన కాలమానానికి పూర్తి విరుద్ధం. ఆంగ్లేయులు కుత్సిత బుద్ధితో ఆదిశంకరుల కాలాన్ని 1000 సంవత్సరాలు ముందు లాగి క్రీ.శ. 5 కాలానికి తీసుకువచ్చారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు.

ఇన్ని ఆధారాలు చూపడానికి కారణం ఒక్కటే. భారతీయ ఇతిహాసలు ప్రపంచ చరిత్రలే కానీ కట్టుకధలు, కపోల కల్పనలు కాదు. మన పిల్లలు లేక మన స్నేహితులు మనల్ని మహాభారతం ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తే, వారికి ఒక తేదీ చెప్పాలి. అందుకోసమే ఇంగ్లీష్ సంవత్సరాలు చెప్పడం జరిగింది. అదీగాక ఇప్పుడు ప్రపంచమంతా గ్రిగేరియన్ క్యాలండర్‌నే ఫాలో అవుతున్నారు. ప్రపంచానికి హిందువులు తమ చరిత్ర గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు, ప్రపంచంలో అందరికి సులువుగా అర్దమయ్యేలా చెప్పాలి. అందుకోసమే మహాభారతం నవబరు 22, క్రీ.పూ.3138 న మొదలైందని ఆ రోజు ఉన్న ఆంగ్లతేదీని చెప్పుకుంటున్నాం. ఇన్ని శాసనాలు, ఆధారాలు కళ్ళ ముందు కనబడుతున్నా, ఇంకా మహాభారతం కేవలం ఒక కధ మాత్రమేనని, దాన్ని నమ్మడం మూఢనమ్మకమని చెప్పేవారిని ఏమనాలో హిందువులే నిర్ణయించుకోవాలి.

To be continued ................

No comments:

Post a Comment