Thursday 10 April 2014

హిందూ ధర్మం - 45 (పోషకాలతో నిండిన ఆహారాన్ని స్వీకరించడం ధీః )

పోషకాలతో నిండిన ఆహారాన్ని స్వీకరించడం ధీః

సహజంగా పండిన శాఖాహారమే బుద్ధిని వృద్ధి చేస్తుంది. ప్రపంచ మేధావులను ఒకసారి పరిశీలిస్తే, అందులో మూడువంతుల మంది శాఖాహారులే ఉంటారు. మాంసాహారం పేరుకే పుష్టికరమైనా ఆహారం. కానీ ప్రపంచంలో అత్యధికంగా రోగాల బారిన పడేది మాంసాహారులే అన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మాంసాహారం త్వరగా అరగదు, ఫలితంగా మత్తును కలిగిస్తుంది. దాంతో కొత్త విషయాలను తెలుసుకునే తగ్గిపోతుంది. మాంసాహారమే కాదు, శాఖాహారంలోనూ రజో గుణాన్ని, తమో గుణాన్ని కలిగించే ఆహారాలను అధికంగా తీసుకోకూడదు. మసాల దట్టించిన వంటకాలు తినడం, ఉల్లి, వెల్లులి అతిగా తినడం వలన కూడా బుద్ధి మందగిస్తుంది.

కాయకష్టం చేసుకునే కూలికి బలం కావాలంటే రోజు కాసింత ఎద్దుకూర తినాలంటాడు ఓ ప్రబుద్ధుడు. అసలు ఎద్దుకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించడు. ఎద్దు తినేది గడ్డి, అంటే శాఖాహారమే కదా. ఎవరైనా లోకంలో మాంసాహారం తినండి అని ప్రోత్సహిస్తున్నారంటే వారు ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారని, మందబుద్ధులుగా తయారుచేయాలని కోరుకుంటున్నారని అర్దం చేసుకోండి.

స్వామి వివేకానందుడు కన్యాకూమారి వద్ద హిందూ మహాసముద్రం మధ్యలో ఒక శిలపై సామాధిలో 3 రోజుల పాటు కూర్చుని, ఆ పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు వివేకానందుడికి భవిష్యత్ దర్శనమైంది. భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాడానికి ఉపయుక్తమయ్యే వాటిని స్వామీజీ దర్శించారు. భారత్‌లో ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారతీయులందరికి పుష్టికరమైన ఆహారం అందిన రోజునే భారత్ తిరిగి పునర్వైభావాన్ని పొందుతుందని గ్రహించారు. అది దైవసందేశం. వివేకానందుడి ద్వారా పరమాత్ముడు భారతీయులకు చెప్పిన దివ్య సందేశం.

వివేకానందుడి 150 వ జయంతి జరుపుకున్నా, ఇంకా ఈ దేశంలో అనేకమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే అందుకు కారణం బాధ్యతారహితులైన భారతీయులే. పౌష్టికారానికి అర్దం మీరు, మీ పిల్లలు రోజు గిన్నెల నిండ అన్నం తినడం కాదు. ఆహారం కోద్దిగా స్వీకరించినా, అది బలవర్ధకమైనదై ఉండాలి. అందులో పోషకాలు ఉండాలి. అది మన బుద్ధిని వృద్ధి చేయాలి. శరీరానికి మంచిబలాన్ని ఇవ్వాలి. అటువంటి ఆహారన్ని స్వీకరించడం ధీః (మన ధర్మం). ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, తిన్న ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయన్నదే ముఖ్యం.    

కానీ ఈ రోజు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పిల్లలకు అటువంటి ఆహారం ఇవ్వడంలేదు,  మనమూ తీసుకోవడంలేదు. జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు మొదలైన తృణధాన్యాలను ఎంతమందిమి తింటున్నాం? మన పిల్లలో ఎంతమందికి అసలు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన తెలుసు?

To be continued............

No comments:

Post a Comment