Friday 20 May 2016

నృసింహ జయంతి శుభాకాంక్షలు



సృష్టి గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాను అనే మనిషిలో కొంత అహంకారం పెరిగి, చివరకు తానే సృష్టికర్తనని, తనను మించిన వారు లేరని భ్రమ పడుతుంటారు. ఆ భ్రమకు నిదర్శనం హిరణ్యకశిపుడు. మనిషికి తెలిసింది కొంచమే, అతడు ఎంత తెలుసుకున్నా ఈశ్వర సృష్టిలో ఒక వంతు మాత్రమే తెలుసుకోగలడని, మిగితా 3 వంతులు ఇంకా మిగిలే ఉంటుందనే విషయాన్ని పురుష సూక్తం చెప్తోంది. దానికి నిదర్శనమే నృసింహావతారం.

పురు’ష ఏవేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||
ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’‍శ్చ పూరు’షః |
పాదో”‌உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”‌உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||

అటువంటి నరసింహ స్వామి మనలో కూడా పేరుకున్న అజ్ఞానధకారాన్ని నశిమజేయాలని, దేహాత్మ భావనను పటాపంచలు చేసి, తాను దేహం కాదు, ఆత్మ అన్న సత్యం ఎరుక పరచాలని కోరుకుంటూ, అందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment