Monday 2 May 2016

రోగనివారణ చేసిన చిన్మయానందులు



దిల్లీలో ఉండే ఒకామెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని అనేక వైద్యపరీక్షల్లో తేలింది. ఆమె స్నేహితుడు కృష్ణవర్మ ఆమెను గురుదేవులు, స్వామి చిన్మయానందుల వద్దకు తీసుకువచ్చారు. కృష్ణ స్వామీజి గదికి వెళ్ళగానే, సమస్య ఏంటని అడిగారు గురుదేవులు. తన స్నేహితురాలి గురించి, ఆమె క్యాన్సర్ గురించి కృష్ణ గురుదేవులకు చెప్పారు. 'ఇదంతా ఒక స్నేహితురాలి కోసమే - సరే' అన్న గురుదేవులు సత్సంగం జరిగే గదికి వెళ్ళి, ఆమెను హత్తుకున్నారు. 'ఆపరేషన్ గురించి నువ్వు భయపడుతున్నావా?' అని అడిగి, 'నవ్వుతూ వెళ్ళి, చిరునవ్వులతో బయటకు రా' అన్నారు (ఆమె స్వామిజీని ఏమీ అడగలేదు). వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమైనప్పుడు, ఆమెలో క్యాన్సర్ లక్షణాలు కించిత్తూ కూడా కనిపించలేదు. ఆ తర్వాత స్వామిజీ, సాయంకాల ప్రసంగాల్లో చెప్పారు 'ఏ భక్తుడైతే ఏదీ అడగరో - అతడికి (ఆమెకు) నారాయణుడు 'కాదు' అని ఎలా చెప్తాడు?' 

No comments:

Post a Comment