Tuesday 5 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (135)



అగస్త్యుడు, కావేరీ నదిని కమండులువులో బంధించాడు. విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి దానిని తన్ని కావేరిని ప్రవహించునట్లు చేసాడు. అగస్త్యునకు కోపం వచ్చింది. కాని తన్నినవాడు వినాయకుడని తెలిసి అతనికి భక్తుడయ్యాడు. ఇప్పుడు వాతాపి కథ చెప్పుకొందాం. వాతాపి, ఇల్వలులనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారు నరమాంసానికి అలవాటు పడ్డారు. ఇక మంత్ర పూతమైన శరీరాలు గల మహర్షుల మాంసం అంటే వారికి మరీ ఇష్టం. మోసం చేసి వారిని చంపుతూ ఉండేవారు. అందులో పెద్దవాడు, బ్రాహ్మణ వేషం వేసుకొని మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మనేవాడు. ఋషి నమ్మేవాడు. తప్పని సరియైతేనేగాని ఋషులు అతీంద్రియ శక్తిని వాడరు. వాతాపి తినే ఆహారమయ్యేవాడు. ఇక తమ్ముడు "వాతాపి బయటకు రా" అని అంటే మేకరూపం ధరించి అవతలి వాని పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆ ఋషిని తినేవారు. అగస్త్యుని దగ్గర కూడా ఆ మోసం చేద్దామనుకున్నారు. అతడు నిరంతరం వినాయకుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. అందువల్ల వారి పన్నాగాన్ని పసిగట్టేడు. వెంటనే 'వాతాపి! జీరోభవ' అన్నాడు అందువల్ల వాతాపి తిరిగి రాలేదు.


ఇతడు వినాయకుని పూజించడం వల్ల లోకానికి ఉపకారం చేసినవాడయ్యాడు. ఆ సందర్భంలో అవిర్భవించినవాడే వాతాపి గణపతి అగస్త్యుడు తిరువారూర్ వెళ్ళి అక్కడ ఈ గణపతిని ప్రతిష్టించాడు. ముత్తుస్వామి దీక్షితులు, ఈ గణపతి మీదనే వాతాపి గణపతిం భజే అనే కీర్తనను వ్రాసేరు. అంతేనే కాని తిరుచెంగట్టాన్ కుడిలో నున్న గణపతి మీద కాదని గుర్తించండి. పాటలో మూలాధార క్షేత్రం అని వస్తుంది. తిరువారూర్, పృథ్వీక్షేత్రం కనుక మూలాధారక్షేత్రమే.


No comments:

Post a Comment