Thursday 14 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (144)



ఆటంకాలను కలిగించినా ఒక పరమ లక్ష్యంతోనే


అప్పుడప్పుడు ఆటంకాలనూ కల్గిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహారానికి శంకరుడు బయలుదేరేటపుడు ఇతణ్ణి స్మరించలేదు. అందువల్ల అతని రథపు ఇరుసు ఊడిపోయింది. దేనికోసం చేసాడు? ఎవ్వరైనా ఒక నియమాన్ని ఉల్లంఘించకూడదనే లక్ష్యంతోనే. అందరికీ ఈ నియమాన్ని నేర్పడానికే అట్లా ముందు ఆటంకాలేర్పడినా దానికి ప్రాయశ్చిత్తం చేసుకొనేవారు చివర సుఖాంతంగానే ఉంటారు. అంతా మనమే చేయగలమని విఱ్ఱవీగడం పనికిరాదనే పాఠం నేర్పడానికే. ఆటంకాలు రావడం, వెంటనే స్వామిని స్మరించడం, వాటిని తొలగించడమూ జరుగుతుంది.

No comments:

Post a Comment