Thursday 7 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (137)



ఏనుగు చెవులను అట్లా త్రిప్పడం ఊరకే కాదు. దానికి ఒక లక్ష్యం ఉంది. దీనినుంచి ఒక్కొక్కప్పుడు మదం కారుతూ ఉంటుంది. ఆ సమయంలో చీమలు, పురుగులు మూగుతాయి. వాటిని తరమడం కోసం భగవంతుడే వీటికి చేటలంత చెవులనిచ్చాడు.


గణేశ పంచరత్నంలో శంకరులు, మదం కారుతున్న వినాయకుని కపోలాలను 'కపోల దాన వారణం' అని వర్ణించారు. 


అతని చెక్కిలినుండి కారే మద జలం సంతోషం వల్ల, దయవల్ల కూడా. అది మధురంగా ఉంటుంది. దీని రుచి కోసం తుమ్మెదలు మూగుతాయి. ఈ మాటను శంకరులు ఇలా అన్నారు. గలత్ దానగండం మిలత్ భృంగషండం 


ఆ తుమ్మెదను కోపంతో తరుముతున్నాడా? ఆ పిల్ల దేవతకు ఇది కూడా ఆటయే. తుమ్మెదలు వచ్చి ఆటలాడుకుంటున్నాయి. అసలితణ్ణి చూడడంతోనే అవి నృత్యం చేస్తాయి. అవి అట్టి మకరందాన్ని పానం చేయాలా? పిల్లల చెవులలో కూతలు కూసి మనం ఆడుకోమా? అవి ఝుంకారం చేస్తూ ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో స్వామికి తెలుసు. వాళ్ళను తరుముతున్నట్లుగా సరదాగా చెవులనాడిస్తాడు. ఆ గాలికి వెళ్ళి పోతూ ఉంటాయి. తిరిగి వస్తూ ఉంటాయి. దీని మదంపై ఆ గాలి చల్లదనాన్ని ఇతనికి కలిగిస్తుంది.

No comments:

Post a Comment