Saturday 16 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (146)



అప్పుడు శేనప్పాకం దగ్గర వినాయకుడికి 108 కొబ్బరి కాయలు కొడతామని మ్రొక్కుకున్నాం, ఎప్పుడో. దానిని మరిచామని గుర్తుకు వచ్చింది.


మరిచిపోయామని చెప్పడంలో అర్థం లేదనుకుంటాను. అది నిర్లక్ష్యమే. మీరిచ్చే దండలను సత్కారాలను, పూర్ణ కుంభాలను స్వీకరిస్తున్నాం కదా! ఇవేమీ మరిచిపోని వాళ్ళం. అది మరిచిపోవడమేమిటి? ఇట్లా మరిచిపోవడం తప్పని గుర్తు చేసాడు స్వామి. నాకేదైనా అయితే నాకేమీ బాధలేదు, ఏనుగుపై స్వామికి ఏదైనా జరిగితే ఎలా? ఆయనా బాధపడలేదు. ఈ పాఠం నాకే. నేనే కదా లోగడ మ్రొక్కినది.


వెంటనే కొబ్బరికాయలను కొట్టడం, ఏనుగు శాంతించడం, యాత్ర సాగడం చకచకా సాగిపోయాయి. ఇది నిజంగానే జరిగింది. ప్రత్యేక పూజలు తరువాత చేసాం. 


ఇట్లా చేయడం వల్ల స్వామికి ఉపకారం చేసినట్లా? ఆయనకేదైనా లాభం ఉందా? ఆయనెప్పుడూ ఆనంద స్వరూపుడే కదా! ఇట్టి వాటిని మన చేత చేయించి మనకు ఆనందాన్ని, పుణ్యాన్ని కల్గిస్తూ ఉంటాడు.


No comments:

Post a Comment