Tuesday 12 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (143)



నిండైన బొజ్జతో, గజముఖంతో ఉన్న మూర్తిని చూస్తే మనకూ సంతోషం కల్గుతుంది. అతని ప్రతిమను చూచినప్పుడు అందవికారంగా, భయంకరంగా కన్పిస్తాడా? పరిశోధకుల మాట అట్లా ఉంచండి. నవ్వును పుట్టించే ఇతణ్ణి వికటరూపునిగానే భావిద్దాం.


ఇతడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు ఎడముఖం పెడముఖంగా ఉంటే ఏదో చిన్న పనిచేసి వారికి వినోదాన్ని కల్పిస్తూ ఉంటాడని లోగడ చదువుకున్నాం. కాకి రూపం ఎత్తి అగస్త్యుని కమండులువును ఒరుగునట్లు చేయడం వల్ల కావేరి నది మనకు లభించింది. బ్రహ్మచారిగా వెళ్ళి విభీషణుణ్ణి మోసగించి శ్రీరంగనాథస్వామిని కావేరీ తీరంలో ప్రతిష్ఠించునట్లు చేసాడు కదా. అతని అన్నగారైన రావణున్ని మోసగించి శివలింగాన్ని గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠించునట్లు చేసాడు కదా. ఇవి అందరికీ ఉపయోగించే చమత్కారాలు. లోక క్షేమంకోసం అట్టి వికట కృత్యాలు చేసాడు. ప్రజల పట్ల ప్రేమతోనే అట్టి చిల్లర పనులు చేసాడు. అంతా ఒక అతని లీల.


పవిత్ర ప్రదేశాలలో వికట వినాయకులు


తంజావూరులో ఒక వినాయకుడున్నాడు. అతనిని చేదు పుచ్చగింజ వినాయకుండంటారు. ఒక వర్తకుడు అక్కడికి జాజికాయల బస్తాను తెచ్చాడు. దీనికి ప్రభుత్వానికి తగిన పన్నును కట్టాలి. ఆ కేంద్రం దగ్గర దీనిలో చేదు గింజలున్నాయని బుకాయించాడు. ముందుగా చేదు గింజల బస్తాలను చూపించాడు. అయితే విఘ్నేశ్వరడూరుకుంటాడా? రాత్రికి రాత్రే జాజికాయ బస్తాలను చేదు పుచ్చ గింజల బస్తాలుగా మార్చేశాడు. కుయ్యో మొర్రో అన్నాడు వర్తకుడు. స్వామీ! వీటిని మళ్ళీ జాజికాయల బస్తాలుగా మారిస్తే ప్రభుత్వానికి పన్ను కడతానని, అపరాధపు రుసుము చెల్లిస్తానని ప్రార్థించాడు. వినాయకుడు మార్చి వేసాడు. మోదక వినాయకుడప్పటినుండి చేదు పుచ్చ గింజలు వినాయకుడయ్యాడు.

ఇట్లా వందల కొద్దీ కథలున్నాయి. తుండంతో ఎత్తి అవ్వైయార్ కైలాసాన్ని చూపించాడని ఇంతకుముందు చెప్పాను కదా

No comments:

Post a Comment