Friday 15 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (145)

 


స్వీయానుభవాలు


రెండు స్వీయానుభవాలను వివరిస్తాను.


మేము వెల్లూర్ వెళ్ళాం. వెల్లూర్ దగ్గర మహిమాన్వితమైన గణపతి విగ్రహాలున్నాయి. శేజ్ పాక్కం దగ్గర, పదకొండు విగ్రహాలు అలాంటివి ఉన్నాయి. వాటిని ఎవ్వరూ చెక్కలేదు. అవి స్వయంభువములు. ఏకాదశ రుద్రులని విన్నాం. కానీ ఇక్కడ ఏకాదశగణపతులున్నాయి.


పూర్వం అన్ని వినాయకుడి విగ్రహాలూ భూమిలో కప్పబడి ఉండేవి. అంటే తాను పృథ్వీతత్వానికి చెందిన వాణ్ణని తెలియజెప్పడం కోసమేమో! అట్టి క్రీడ కూడా ఆయన చేస్తాడు. మరాఠా రాజ్యానికి మంత్రియైన తుకోజీ అలాంటి మార్గం గుండా ఒక గుఱ్ఱం బండిలో వెడుతున్నాడు. ఒకచోట వచ్చేటప్పటికి బండి ఇరుసు విరిగింది. బండి ఆగిపోయింది. దిగి చూడగా అక్కడ రక్తపు మరకలు కన్పడ్డాయి. మనిషి ఎవ్వడూ కనబడడం లేదు. మర్నాడు ప్రొద్దున్న వరకూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఏమిట్రా భగవంతుడా, ఈ ఆటంకమేమిటని వినాయకుణ్ణి ప్రార్ధించి పడుకున్నాడు. స్వామి, కలలో కనబడి, ఇక్కడే నా ఏకాదశ మూర్తులు కప్పబడ్డాయి, నీ బండి చక్రాలు వాటికి తగలడం వల్ల రక్తం వచ్చింది. ఇంతవరకూ భూమిలో కప్పబడి ఉండాలని అనుకున్నాను. ఇక ప్రజల క్షేమం కోసం బయట పదాలనుకున్నా. కనుక ఒక మందిరాన్ని కట్టు, కుంభాభిషేకం చేయవలసిందని ఆజ్ఞాపించాడు. తుకోజీ ఆలయాన్ని కట్టాడు.


ఆ ప్రాంతం గుండా మేమూ వెడుతున్నాం. ఏం జరిగిందో తెలుసా చిన్నస్వామి, జయేంద్ర సరస్వతి ఏనుగు మీద కూర్చొని యున్నారు. ఏనుగు ఇక్కడకు వచ్చేటప్పటికి కదలలేదు. ఏమిటో చుట్టూ తిరుగుతోంది. దానిని శాంత పరచడానికి మావటీడు, శతవిధాల ప్రయత్నించాడు. స్వామియేమో దానిపై కూర్చున్నారు. ఏమిటా అని కంగారు పడ్డాం.

No comments:

Post a Comment