Monday 18 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (148)



ఇద్దరు వినాయకులు


విఘ్నరాజో వినాయకః అని కదా. విఘ్నరాజ పదం తరువాత వినాయకుడు వస్తాడు.


ఇద్దరు వినాయకులను ప్రక్కప్రక్కనే స్థాపించడమూ ఉంది. చాలాచోట్ల ఇద్దరు వినాయకులున్న వీధి అని ఉంటుంది. అందు ప్రక్కప్రక్కనే కూర్చొని యుంటారు. శివాలయాలోలనూ ఇట్లా ఉంటుంది.


ఇట్లా ప్రతిష్టించిన తరువాత మిగతా దేవతా మూర్తులుండరు. ఇట్టి గౌరవం ఒక్క మన స్వామికే. 


ఎందుకిట్లా చేస్తారు? రెండు విరుద్ధ కార్యాలు చేస్తాడు కనుక. ఒక మూర్తి విఘ్నాలను కల్గిస్తాడు. మరొక మూర్తి విఘ్నాలను పోగొడతాడు. ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కన్పిస్తారు. విఘ్నాలను కలిగించే ఈశ్వరుడని, రాజని ఆ పదాన్ని అర్ధం చేసుకోకూడదని లోగడ అన్నాను. గుర్తుందా? ఈశ్వరుడైనా, రాజైనా ఆటంకాలను తొలగిస్తాడని, అందువల్ల అట్లా అర్థం చేసుకోవాలని అన్నాను. మనం విఘ్నేశ్వరుని పూజించేటపుడు ఈ భావనతోనే ఉండాలి.

No comments:

Post a Comment