Saturday 23 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (152)

 


వి-అనే ఉపసర్గ


'వి' ఏమని చెబుతోంది? ఒక పదానికి ముందు వి అనే ఉపసర్గను చేరిస్తే పదం యొక్క అర్థం మారుతుంది. మలం అంటే 'అశుద్ధం', విమలం అంటే 'స్వచ్ఛమని', ఆ 'వి'ని శుద్ధపదం ముందుంచితే ఇంకా స్వచ్ఛమని అర్థం. పరీతం అనగా ఒక పద్ధతిలో వెళ్ళడం. విపరీతం అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడం. జయానికి, వి చేరిస్తే ప్రత్యేకమైన జయం.


శేషం అంటే మిగిలినది. మిగిలిన వాటితో కలవకుండా విడిగా ఉంటూ గొప్పదనాన్ని సూచించేదనే అర్థంలో విశేషం అంటాం. శిష్ట అనే పదం ఈ శేషనుండి వచ్చింది. వారు విశేష గుణ సంపన్నులని, శిష్టులని వాడతారు. శిష్టాచార మనే మాటను విన్నాం కదా.


రెండర్థాలలో వినాయకుడు


ఇందులో రెండు పరస్పర విరుద్ధార్థాలు వస్తాయి. చిత్రంగా లేదూ! ధవుడనగా పతి, మాధవుడనగా లక్ష్మికి పతి, విధవయనగా భర్తలేనిది. అట్లా వినాయకుడుని తన విశిష్ట నాయకుడు, విగత నాయకుడు. అనగా తనకెవ్వరూ నాయకులు లేరని, తానే అందరి కంటే గొప్ప నాయకుడని అర్థాలు వస్తాయి.


ఒక భక్తుడు, భగవంతుని దగ్గరకు వెళ్ళి నేను 'అనాథను' అన్నాడట 'నీవూ అనాథుడవే' అన్నాడట వెంటనే. 'నన్ను అనాథనంటావా' అని భగవంతుడు అన్నాడట: 'అవునయ్యా, నాకు నాథుడు లేకపోవడం వల్ల నేను అనాథ నయ్యాను, ఇక నీవు నీ కంటె పైన నాథుడు లేకపోవడం వల్ల నీవు అనాథవయ్యా'వని అన్నాడట. అట్లా వినాయకుడు కూడా.


No comments:

Post a Comment