Sunday 17 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (147)



ఆటంకం వచ్చినపుడు ప్రతి క్రియ చేసి దానిని తొలగించుకొనే సమయంలో ఇంకా అనందాన్ని పొందుతాం. బాగా ఎండ మండిపోతూ ఉంటే నీడయొక్క రుచి తెలుస్తుంది. ఒక నల్లని బట్టపై తెల్లని వెండి జరీ ఉన్నపుడు చూడడానికి బాగుంటుంది. అట్లాగే ఏదైనా పని చేసినపుడు విఘ్నం వస్తే దానిని తొలగించుకోవడం వల్ల ఎక్కువ తృప్తి కల్గుతుంది.


ఇట్టి ఆనందం, భక్తి వల్ల వచ్చింది. అపుడు మనమేమనుకొంటాం స్వామిని మరిచిపోయినా, అతనికేది ఆక్కఱ లేకపోయినా మన కోరికలను తీరుస్తున్నాడని, మన చిన్నపాటి భక్తికి సంతోషిస్తున్నాడని అతని అనుగ్రహం లేకపోతే మనమొక అడుగు ముందుకు వేయలేమని, ఇది గుర్తు చేయడానికి చిన్న చిన్న ఆటంకాలు కల్గిస్తూ ఉంటాడని భావిస్తాం. కనుక అప్పుడప్పుడు మనకు బుద్ధి రావడానికి ఆటంకాలు కల్పిస్తాడు.


No comments:

Post a Comment