Tuesday 26 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (155)

వినాయక పురాణాన్ని చూసాను. వినాయకునకు సంబంధించిన రెండు పురాణాలున్నాయి. ఒకటి భృగుమహర్షి చెప్పినది. కనుక భార్గవ పురాణమైంది. ముద్గలుడు చెప్పనది ముద్గలపురాణం. నేనిపుడు చెప్పేది భార్గవ పురాణం నుండే.



ఈ పురాణంలో ఉపాసన కాండం, లీలా కాండమని రెండు కాండలున్నాయి. లీలా కాండంలో వినాయకుని 12 అవతారాలు వర్ణింపబడ్డాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయం. ఇందు గణేశుడొకడు, గణపతి యొకడు. ఇందు షోడశనామాలలో పేర్కొన్న వక్రతుండుడు, భాలచంద్రుడూ, గజాననుడూ విడివిడిగా అవతారాలుగా ఉన్నారు. అందులో ధూమ కేతు అవతారం గురించిన కథ ఉంది. ఎప్పుడో చదివాను. గుర్తున్నది చెబుతాను.


ధూమాసురుడనే అసురుడు ఉండేవాడు. వృత్రాసురుడు, మహాబలివంటి వారు భాగవతంలో పేర్కొన్నట్లుగా, అసురులలో భక్తి అనే లక్షణమూ ఉంది. అయితే వారిలో అసురత్వం ప్రధానంగా ఉంటుంది. ధూమాసురుడట్టివాడు. ఒక రాజు, అతనికొక భార్య ఉన్నారు. ఆ రాణి గర్భంలో విష్ణువు జన్మిస్తాడని తన మరణానికి కారకుడౌతాడని విన్నాడీ అసురుడు. అందువల్ల సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి రాత్రి వెళ్ళి ఆ రాణిని చంపుమని అన్నాడు. ఇతడు వెళ్ళి గర్భిణియైన స్త్రీని, అందునా శుభలక్షణాలు కలిగిన స్త్రీని చంపడం తప్పని గ్రహించాడు. ఆ జంటను విడదీయకూడదని భావించాడు. కనుక మంచంపై నిద్రించే వారినిద్దరిని మంచంతో బాటు మోసుకొని ఒక అరణ్యంలో విడిచి పెట్టాడు. ఇదేమి కష్టంరా బాబూ అంటూ వారిద్దరూ వినాయకుని ప్రార్ధించారు, సుఖప్రసవం జరగాలని, తిరిగి రాజ్యానికి వచ్చేటట్లు చేయమని ప్రార్థించారు.


No comments:

Post a Comment