Wednesday 27 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (156)

వీరెక్కడో అరణ్యంలో దాగియున్నారని ధూమాసురుడు విన్నాడు. వెంటనే శస్త్రాలతో వెళ్ళాడు. అతని చేతిలోని శస్త్రం పొగయే. అతని పేరే ధూమాసురుడు కదా! అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అందుండి బాగా పొగ వస్తుందన్నమాట.



నేడు కూడా బాప్ప వాయువులను ప్రయోగిస్తూ ఉంటారు. మనుష్యులను చంపే రసాయనిక వాయువులను విదిలుతూ ఉంటారు. ఇట్టివే ఆనాడు మంత్రశక్తితో ప్రయోగించేవారు. గర్భిణిని చంపాలని వెడితే ఆమె ఒడిలో పిల్లవాడు కన్పించాడు. అతడు విష్ణ్వంశతో బుట్టిన వినాయకుడే. అనగా సమస్త దేవతా స్వరూపుడు వినాయకుడని తెలియడం లేదా? శివుని తనయుడైన వినాయకుడు, విష్ణయంశతో పుట్టాడంటే శైవ వైష్ణవాల సంగమమే. శుక్లాంబరధరం విష్ణుం అని చదువుతాం కదా.


అతడస్త్రాన్ని ప్రయోగించగా పొగ కమ్మింది. ఆ పొగనంతటిని పిల్లవాడు ఒడిసి పట్టాడు. తన అస్త్రం పనిచేయడం లేదని అసురుడు తెల్లమొహం వేసాడు. ఒక కొత్త అస్త్రం ప్రయోగించే ఓపిక లేదు. ఆ సమయంలో మన స్వామి అతణ్ణి చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రత్యేకంగా ఒక అస్త్రం వేయకుండా అతడు ప్రయోగించిన విషవాయుపువే విడుదల చేసాడు స్వామి. అట్లా అతని సంహారమైంది.


అందువల్ల ధూమకేతువయ్యాడు. ధూమమే ధూమ్రము, ధూమ్రకేతువు కూడా.


No comments:

Post a Comment