Sunday 18 May 2014

హిందూ ధర్మం - 61

మీ సేవకులను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, వారందరూ మీ ఆజ్ఞను పాలిస్తున్నారని, మీరు మీ శత్రువులను జయించారని భావిస్తున్నాను. మీ రాజ్యంలో సైన్యం, మిత్రులు, పుత్రపౌత్రాదుల విషయంలో బంధాలు సక్రమంగానే ఉన్నాయని, ఆర్ధిక పరిస్థితి/వనరులు సరిగ్గానే ఉందని భావిస్తున్నా అంటూ వశిష్టమహర్షి విశ్వామిత్రుని అడిగుతాడు. అన్నీ బాగానే ఉన్నాయి అన్న సమాధానాన్ని విశ్వామిత్రుడు ఇస్తాడు. ఎన్నో సంవత్స్రాల తర్వతా కలిసిన వారిలా చాలా సేపు వీరిద్దరు ఆనందంతో అనేక విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆఖరున వశిష్ట మహర్షి 'నేను మీకు, మీ సమస్త సైన్యానికి మీ హోదాకు తగ్గట్టుగా ఆతిధ్యం ఇవ్వదల్చుకున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించండి్' అని విశ్వామిత్రునితో అన్నారు.

మీరు మా ఆశ్రమానికి వచ్చిన విశిష్టవంతమైన అతిధులు, కనుక దయతో నా విజ్ఞప్తిని మన్నించి, నా సేవలు అందుకోండి అని మహర్షి వేడుకున్నారు. అతిధి దేవో భవ అన్నది సనాతన ధర్మం. మన ఇంటికి వచ్చిన అతిధి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అతిధి తృప్తి చెందితే, దేవతలు సంతోషిస్తారు.

అందువల్ల తన ఆశ్రమానికి విచ్చేసిన విశ్వామిత్రుడికి, అతని సైన్యానికి అతిధ్యం ఇవ్వాలని వశిష్టమహర్షి వారికి ఘనస్వాగతం పలికారు. అయినా ఇంత గొప్ప రాజును, కందమూలాలు, అడవిలో దొరికే పండ్లను మాకు భోజనంగా అందిస్తారు. నా సైన్యంలో ఉన్న ఏనుగులకు, గుర్రాలకు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. అర్దం లేకుండా మాట్లాడుతున్నాడీ మహర్షి అనుకున్న విశ్వామిత్రుడు, మీరు నాతో పలికిన ప్రేమపూరితమైన పలుకులే నాకు మీరిచ్చిన గౌరవం. ఈ విధంగా మీరు నాకు గొప్ప ఆతిధ్యం ఇచ్చారు. వేరే విధమైన ఆతిధ్యం అవసరంలేదు అని జవాబిచ్చాడు.

రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, దాహం తీర్చారు, మీ దగ్గర కాసే పండ్లను ఇచ్చారు, ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించాయి. అన్నిటికంటే విలువైనది మీ దర్శన భాగ్యమే. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న మీకు నమస్కరించడం, మీతో గడపడం, మాట్లాడడమే నా భాగ్యం. కనుక నన్ను మన్నించి, నన్ను వెళ్ళనివ్వండి అన్నారు విశ్వామిత్రుడు.

To be continued ................

No comments:

Post a Comment