Tuesday 20 May 2014

హిందూ ధర్మం - 63

విశ్వామిత్రుని మాటలను విన్న వశిష్టమహర్షి శాంతంగా 'రాజా! లక్ష ఆవులు ఇచ్చినా, కోటి ఆవులు ఇచ్చినా, వెండి వస్తువులు సమర్పించినా, నేను ఈ శబలను ఇవ్వలేను. ఈ శబలను నేను విడిచిపెట్టడం శబలకు మనచిది కాదు. మీరు నా నుంచి బలవంతంగా కూడా ఈ శబలను తీసుకోలేరు. ఎందుకంటే ఈ శబల శాశ్వతంగా నాది, నా నుంచి దాన్ని వేరుగా చూడలేను. వ్యక్తి నుంచి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని వేరు చెయలేనట్లుగానే ఈ శబలను కూడా వేరు చేయలేరు. ఈ శబల చేత నా జీవితం సులభంగా సాగుతోంది. దేవతలకు హవ్యం, పితృదేవతలకు కవ్యం, నిత్యం చేసే అగ్నిహోత్రం, హోమం, బలి (జంతువులను చంపడం కాదు) మొదలైన అన్ని కార్యాలకు ఈ శబలే ఆధారం. నా ఆశ్రమంలో అగ్నికార్యాలకు, వేదాధ్యయనానికి, విద్య మొదలైన అన్నిటికి మూలం శబలే అన్న విషయంలో సందేహంలేదు. నిజం చెప్పాలంటే శబలనే నాకు అన్నీ, దానికి చాలా కారణాలు ఉన్నాయి, కనుక ఓ రాజా! నీకు ఈ శబలను నేను ఇవ్వలేను' అన్నారు.

మాట్లాడటంలో చతురుడైన విశ్వామిత్రుడు వశిష్టుడిన ఒప్పించే విధంగా పలుకుతూనే, వాదించడం మొదలుపెట్టాడు. అందంగా అలకరించబడిన తల్లని నాలుగు గుర్రాల లాగబడే 800 బంగారు రధాలను ఇస్తాను, మంచి జాతికి చెందిన బలిష్ఠమన 11,000 గుర్రాలను, ఎన్నో రకరాకాల రంగులు కలిగిన కోటి ఆవులను ఇస్తాను, అందులో ఏ ఒక్క ఆవుకి మిగిలిన వాటితో పోలిక ఉండదు, మంచి పాలు ఇస్తాయి, మీకు నచ్చితే వజ్రవైఢూర్యాలను, బంగారాన్ని మీరు అడినంత ఇస్తాను కానీ నాకు ఈ శబలను ఇవ్వండి అన్నాడు. దానికి బదులిస్తూ వశిష్టమహర్షి 'మీరు నాకు ఏది ఇస్తారన్నది ముఖ్యం కాదు, నేను శబలను ఇచ్చేదే లేదు. నా దగ్గరున్న ఈ శబల పెద్ద రత్నం వంటింది, కనుక నాకు ఇతర రత్నాల అవసరంలేదు, ఇది నాకున్న సంపద, నాకు రధాలు, గుర్రాలు, ఏనుగులు అవసరంలేదు, ఇదే నాకు సర్వస్వం, నిజానికి ఇదే నా జీవితం, నువ్వు నన్ను నా జీవితం నుంచి వేరు చేయలేవు. ఇదే నాకు దర్శపూర్ణమాసాలతో సమానం, ఇదే దక్షిణతో కూడిన వైదిక క్రతువు వంటిది, నేను చేసే సేవలన్నిటికి ఇదే ప్రధానం. నేను చేసే అన్ని పనులు ఈ శబలతో ముడిపడి ఉన్న కారణం చేత, దీని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. అయినా దీని కోసం ఇంత బేరం అవసరంలేదు' అన్నారు.

వశిష్టుడు ఇవ్వడంలేదని విశ్వామిత్రుడికి కోపం వచ్చి కామధేనువును బలవంతంగా లాక్కుని వెళ్ళడం ప్రారంభించాడు.

To be continued .............

No comments:

Post a Comment