Monday 26 May 2014

హిందూ ధర్మం - 67 (రాజర్షి విశ్వామిత్రుడు)

వెళ్తూ వెళ్తూనే అస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. వశిష్ట ఆశ్రమం మొత్తం తలగబడిపోయింది. అక్కడున్న ఋషులందరూ తలొక దిక్కుకు పరిగెత్తారు. వశిష్టుని శిష్యులు, చివరకు జంతువులు, పక్షులు కూడా భయంతో పరుగులు తీశాయి. ఆ ఆశ్రమం ఎవరు లేక నిశబ్దంగా మారి, శ్మశానాన్ని తలపిస్తోంది. అప్పటికే వశిష్టుడు భయపడకండి, భయపడకండి, నేను ఉన్నాను, విశ్వామిత్రుడిని నశింపజేస్తానని చెప్తున్నా ఎవరు వినలేదు.

అప్పుడు మహా తప్పశాలి, తేజోవంతుడు, బ్రహ్మమానాసపుత్రుడైన వశిష్టుడు విశ్వామిత్రునితో 'ఓం మూఢుడా! ఎంతో కాలం నుంచి పోషింపబడిన ఆశ్రమాన్ని నాశనం చేసి, దురాచారివి అయ్యావు, ఇక నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను' అన్నారు. ఎంతో కాలం నుంచి ధర్మప్రభోదం చేస్తూ జాగ్రత్తగా ఋషులను, జంతువులను, పక్షులను, చెట్లను పోషించుకుంటూ వచ్చాను. అవి ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. ఎక్కడికైనా ఎగరగల స్వేచ్ఛ ఉన్నపక్షులు నీకు ఏం హాని చేశాయి? ప్రపంచాన్ని ఇప్పుడే చూసిన లేగదూడలు నీకెం అపకారం చేశాయి. నీకు అడిగింది ఇచ్చే మొక్కల మీద నీ ప్రతాపం ఎందుకు? సర్వజనుల శాంతి కోసం నిత్యం తపించే ముని శ్రేష్టులు నీకు ఏం ద్రోహం చేశారు. నీకు మదమెక్కి ఈ పని చేశావు. నీ గొడవ నాతో అయినప్పుడు నన్నే ధైర్యంగా ఎదురుకో. అంతేకానీ ఇతరులపై నీ ప్రతాపమా? అంటూ వశిష్టమహర్షి వేగంగా తన దండాన్నితీసారు. అది ప్రళయకాలపు అగ్నిలా ఉంది, మరొక యమదండమేమో అనుపిస్తోంది.

వశిష్టుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఇదిగో దీన్ని ఎదురుకో అంటూ అస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. వశిష్టమహర్షి అపరకాలదండాన్ని, తన బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకుని, నీతిలేని క్షత్రియుడా! నేను ఇక్కడే నిల్చుంటాను. నువ్వు ఎన్ని అస్త్రాలైనా ప్రయోగించు, అన్నిటికి నాశనం చేసి, నీ దర్పాన్ని నశింపజేస్తాను. తపశ్శక్తి చేత పొందిన దైవబలం, బ్రహ్మబలం ముందు క్షత్రియబలమెంత? చూడు నా తపోబలం ప్రతాపం చూపిస్తాను అన్నారు.

To be Continued ...............

No comments:

Post a Comment