Friday 16 May 2014

భారతీయ జనతా పార్టికి శుభాభినందనలు

2014 ఎన్నికల ఫలితాల్లో దేశంలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భివించిన భారతీయ జనతా పార్టికి(బీ.జే.పీ)కి, ప్రధాని నరేంద్ర మోడీకి శుభాభినందనలు. ఈరోజు కాదు, ఎప్పుడైతే దేశంలో ఉన్న పార్టీలన్నీ అధికార పార్టీపై దాడి చేయకుండా, అధికార కాంగ్రెస్‌తో కలిసి మోడీపై దాడి విమర్శల దాడికి పూనుకున్నాయో, ఆ రోజే మోడిని ప్రధాన మంత్రిగా ఆయా పార్టీలు అంగీకరించాయి. మతతత్వం అనే ముద్ర వేసి ఎంత ఆపడానికి ప్రయత్నించినా, సర్వ శక్తులు ఒడ్డి, బీజేపీ ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మోడిదే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకే ప్రజ అనే నినాదంతో ముందుకువచ్చేలా ప్రజల్లో జాతీయ భావాన్ని, ఐక్యతను తీసుకురావడంలో మోడీ సఫలమయ్యారు, దాని ఫలితం ఈ రోజు చూస్తున్నాం.

బిజేపీలో ఉన్న సభ్యులంతా ఆర్ఎస్ఎస్ సభ్యులే. ఆర్ఎస్ఎస్ (రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ప్రపంచంలోనే అతి పెద్ద జాతియవాద సంస్థ. ఆర్ఎస్ఎస్ సభ్యులకున్న క్రమశిక్షణ, దేశభక్తిని గూర్చి చెప్పడం వర్ణనాతీతం. అవసరమైతే దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదలడానికి సిద్ధంగా ఉంటారు ఆర్ఎస్ఎస్ సభ్యులు. భారత్ మీద ఈగ కూడ వాలనివ్వరు. కనుక ఏ విధంగానూ దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయరు. దేశబధ్రత విషయంలో భారతీయులు సంతోషపడవలసిన సమయమిది.

స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రేతర అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి బిజేపి ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏకు 336 స్థానాల్లో ఆధిక్యత రావడం, ఒంటరిగా బిజేపీ మాజిక్ ఫిగర్ 272 దాటి 282 స్థానాలను కైవసం చేసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదే బిజేపికి మంచి అవకాశం కనుక బిజేపి తన సొంత మ్యానిఫేస్టోని అమలు చేస్తుందని ఆశిద్దాం. అక్రమంగా బంగ్లాదేశి చొరబాటు దారులను వెనక్కుపంపడం, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసి, కాశ్మీర్‌ను భారత భూభాగంగా గుర్తించడం, గోవధ నిషేధం వంటి వాటితో పాటు విద్యావవస్థలో సమూలమైన మార్పులను తీసుకువచ్చి, అబద్దాలతో నిండి ఉన్న భారతదేశ చరిత్రను నిజమైన చరిత్రతో సరిచేస్తారని, విదేశి అనుకూల ఆర్ధిక విధానలను ప్రక్కతోసి స్వదేశి ఆర్ధిక విధానలను అమలు పరుస్తారని ఆశిద్దాం. ఇవన్నీ బిజేపీ మ్యానిఫెస్టోలో ఉన్నవే. అదే విధంగా కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌ల విషయంలో పాకీస్థాన్, చైనాలతో కఠినంగా వ్యవహరిస్తారు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారని గట్టిగా నమ్మచ్చు. బీజేపీ సాధించిన ఈ విజయం వెనుక ఉన్న ఎందరో కార్యకర్తలకు, సంఘసభ్యులకు శుభాభినందనలు.

నరేంద్ర మోడిగారి సారధ్యంలోని ప్రభుత్వంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతుందని, దేశంలో ధర్మం నిలబడుతుందని, భారత్ విశ్వగురు స్థానాన్ని తిరిగి చేరుతుందని ఆశిద్ధాం.

సర్వేషాం మంగళం భవతు
జై హింద్   

No comments:

Post a Comment