Friday 2 January 2015

హిందూ ధర్మం - 124 (‪‎బ్రాహ్మణాలు‬)

కధలనగానే ఒట్టి కల్పితాలని భావన చేయకూడదు. అవి కర్మలు, ధర్మాలతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఉదాహరణకు ఐతరేయ బ్రాహ్మణం లో భూ భ్రమణం గురించి, భూగోళ ఆకృతి గురించి ఈ విధంగా చెప్పబడింది. "అందరు భావిస్తారు కానీ నిజానికి సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, అస్తమించడు భూభ్రమణం కారణంగా రెండు వ్యతిరేక ప్రభావాలు వస్తాయి. ఒక వైపు పగలు ఉంటే, ఇంకొక వైపు రాత్రి ఉంటుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న దిశలో పగలు ఉంటే, దానికి వెనుక భాగంలో రాత్రి ఉంటుంది. కానీ సూర్యుడు ఎన్నడు అస్తమించడు ............" - ఐతరేయ బ్రాహ్మణం 3.44

The Sun does never set nor rise. When people think the Sun is setting (it is not so). For after having arrived at the end of the day it makes itself produce two opposite effects, making night to what is below and day to what is on the other side…Having reached the end of the night, it makes itself produce two opposite effects, making day to what is below and night to what is on the other side. In fact, the Sun never sets….” - Aitareya Brahmana (3.44)

అట్లాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు బ్రాహ్మణాలలో ఉన్నాయి. అర్దవాదంలో ఉన్న బంధూత పద్ధతి అనుసరించి పదాల వ్యుత్పత్తుల నుంచే వ్యాకరణం (grammer) , భాషాశాస్త్రం ఉద్భవించాయి. యజ్ఞయాగాది క్రతువుల ఆచరించాల్సిన నిర్దేశిత సమయాన్ని లెక్కించేందుకు గ్రహాల కదలికలు అవసరం. దానికి మూలమైన ఖగోళశాస్త్రానికి  (Astronomy) బ్రాహ్మణాల నుంచే అభివృద్ధి చెందింది. అదే గాకా, వీటి నుంచే రేఖాగణితం (Geometry) , సాంఘిక శాస్త్రం (Social), అర్ధశాస్త్రం (Economics), రాజనీతి శాస్త్రం (political) ఉద్భవించాయి.

కాగా ఈ బ్రాహ్మణాలను వేదానికి చెందిన భాగాలే కానీ, సనాతనమైన వేదం కాదు. ఎందుకంటే బ్రాహ్మణలలో రాజులు, ఋషుల పేరు
లు, కొన్ని చారిత్రిక సంఘటనలు, కొందరి జీవితచరిత్రలు ఉన్నాయి. అనంతమైన కాలగతిలో ఎంతో మంది తమ కర్మలను అనుసరించి జన్మిస్తారు, మరణిస్తారు. వ్యక్తులు శాశ్వతం కాదు, అలాగే వ్యక్తి పేర్లు కూడా. పేరు దేహానికే గానీ, ఆత్మకు కాదు. దేహం ఆశాశ్వతమైనది. అటువంటి వాటి గురించి వేదాలు చెప్తే, అవి సనాతనమైనవి ఎలా అవుతాయి. పైగా వేదాలు ఈ యొక్క బ్రహ్మాండానికో, మనం ఇప్పుడున్న ఈ యొక్క విశ్వానికో చెందినవి కావు. వేదం ఎప్పటికి ఉంది. అనంతమైన భగవత్ సృష్టిలో ఉన్న అన్నిటికి అది వర్తిస్తుంది. కనుక అది ఒక వ్యక్తి గురించి, ప్రవక్తల గురించి చెప్పనే చెప్పదు. ఎప్పుడైన వేదం అని చెప్పవలసివస్తే, అది మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు వేదాలకు శుద్ధమైన అర్ధాలు వ్యాఖ్యానం మాత్రమే. ఇక్కడో విషయం హిందువులు గుర్తుంచుకోవాలి. వేదాల్లో ప్రవక్త, మహమ్మదు, ఏసు అంటూ ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి గురించే చెప్పలేదు, అసలు వేదాల్లో వ్యక్తుల పేర్లు, భగవదవతారాలు లేవు, అలా ఉన్నాయని మనమే అంగీకరించడం లేదు, ఇక వారి ప్రవక్తల పేర్లు ఎక్కడ ఉంటాయి. అటువంటి విషయాలు ఎవరైనా చెప్తే, తక్షణమే ఖండించండి.

To be continued ...................

No comments:

Post a Comment