Wednesday 15 July 2015

పుష్కరాల నెపంతో హిందూసంస్కృతిపై పై తెదేపా దాడి

పుష్కరాల ముందు నుంచి కొందరి వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులను పనిగట్టుకుని ఇన్ని మాటలు ఎందుకంటున్నారా అని బాధేస్తుంది. ఒకడేమో పుష్కరాలు మతాతీతం అంటాడు. ఇంకొకడు అసలు పుష్కరాలు జరపడమే తప్పు, అదంతా మూఢనమ్మకం అంటాడు. ఇంకొకడు హిందువులకు వెర్రి, ఆ వెర్రి వాళ్ళ ఓట్ల కోసమే మా నాయకుడు పుష్కరాలకు పూనుకున్నాడు, ముహూర్తం చూసుకుని మునకేశాడు అంటున్నాడు. నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యత హిందూత్వ వాదులు, ఆధ్యాత్మిక జీవులు, ప్రజలు కూడా వహించాలని ఇంకో కుహనా మేధావి విమర్శ. వీళ్ళంతా ఏవరో అనామాకులు కాదు, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆయన భజన బృందం.
మళ్ళీ ఈ స్నానాలు చేయడం పిచ్చి అంటున్నారు ఆ పార్టీ వాళ్ళే. అసలు వాళ్ళు తప్ప మనకు ఇంకెవరు దిక్కులేరని అనుకుంటున్నారేమో? మరి మాకు పిచ్చి పడితే అది బహిరంగంగా చెప్పచ్చు కదా, అలా దాచుకుని మీరు పిచ్చి నటించడం ఎందుకు?

పుష్కరాలు, లేక హైందవ ధర్మానికి చెందిన ఉత్సవాలు, పండుగలు చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఊరుకోండి. ఏమీ చేయకండి. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారు. దేవాలయాలని మీ గుప్పిట పెట్టుకుని, ఆలయ హుండీల్లో సొమ్మును ప్రభుత్వం తీసుకుంటూ, పండుగలు, ఉత్సవాలు, పుష్కరాల సమయంలో టూరిజం ప్రమోట్ చేసుకుని డబ్బు సంపాదిస్తూ, తిరిగి హిందువుల మీద పడి ఏడ్చే మిమ్మల్ని ప్రజలు ఏమనాలి?

అసలు పుష్కరాలు మతాతీతం అని వాళ్ళు ఎలా చెప్తారు? పుష్కరుడు, బృహస్పతి, పితృదేవతలు, నదులకు పూజ, ప్రకృతి పూజ, నదీస్నానం .......... ఇవన్నీ ఏ మతగ్రంధం అంగీకరిస్తుంది? ఒక్క హిందూ ధర్మం తప్పించి మరే మతగ్రంధమూ వీటిని అంగీకరించదు. పుష్కరాల్లో ఎవరైనా స్నానం చేయవచ్చు. అంతమాత్రానా పుష్కరాలు మతాతీతం కావు. పుష్కరలు హిందూ ఐక్యతకు నిదర్శనం.

ఈ దేశంలో పుష్కరాలు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. వాటికి ఏ ప్రచారమూ లేదు, అవసరంలేదు. పంచాంగంలో చెప్పిన ఒక చిన్న తిధిని గుర్తుపెట్టుకుని వేలాదిమంది స్వచ్చందంగా హాజరవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు, పుష్కరాల పేరుతో తమను తాము మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు పుష్కరాల్లో రకరకాల వస్తువులు అమ్మెవారు, ఇప్పుడు ఏకంగా పుష్కరాలనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పడకముందు కూడా పుష్కరాలు జరిగాయని మర్చిపోకండి. పుష్కరాలు విజయవంతమైతే, అది మీ పార్టి ఖాతాలో వేసుకుంటారా? అందులో అపశృతి జరిగితే దానికి హిందువులు బాధ్యులా?  ఆధ్యాత్మిక గురువులు బాధ్యులా? ఆధ్యాత్మికతయే భారతదేశానికి ఊపిరి. ప్రవచనాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందులో వారు చెప్పే విలువలతో కూడిన మాటలే ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి. అసలు పుష్కరాలకు ముందు మీరెంత మంది సాధుసంతులతో సమావేశం జరిపారు? అసలు అలాంటి ఆలోచన వచ్చిందా? ఇందులో స్వయం సేవకులు, విహెచ్‌పిని భాగాస్వామ్యం చేశారా? అనేక ఇతర హిందూ ధార్మిక సంస్థలను పిలిచారా? కేవలం మీ పార్టీ కార్యక్రమంలా జరిపారు. మిత్రకూటమిలోని మంత్రిని కూడా పక్కన పడేశారు. అలాంటీ మీరా హిందూసమాజాన్ని విమర్సించేది. ఎక్కడైనా తొలిస్నానం పుణ్యమూర్తులు, సాధువులు, సన్యాసులు చేస్తారు. మరి మీ దగ్గరో? అందరిని పక్కన పెట్టారు. ఘోరం జరిగాకా హిందువుల మీద నింద వేస్తారా? ఎన్ని చేసినా మేము భరించాలని మీరు భావిస్తున్నారా?

ఎప్పుడూ ఏదో ఒక రకంగా హిందువుల మీద దాడి చేస్తూనే ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇకనైన ఇలాంటి అర్దంపర్దం లేని వ్యాఖ్యలకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలకు స్వస్తి చెప్పాలి.  
(ఈ వ్యాఖ్యలు ఎవరో కార్యకర్తలు చేయలేదు, తెదేపాలో మంచి స్థానంలో ఉన్నవారు చేసినవి.)

No comments:

Post a Comment