Sunday 13 September 2015

హిందూ ధర్మం - 175 (ఛంధస్సు - 3)

భూమ్యాకర్షణ పరిధిలోగానీ, అంతరిక్షంలో కానీ నీరు లేదనుకుందాం. ఇక మిగిలింది సూర్యమండంలం, నక్షత్ర మండలం. సూర్యునిలో మనకు అప్పుడప్పుడు కొన్ని మచ్చలు కనపడుతుంటాయి. సూర్యగోళంలో హైడ్రోజన్, హీలియం వాయువుల ఘర్షణల వల్ల, హీలియం హైడ్రోజన్ గా మారే క్రమంలో వెలువడే రేడియోధార్మిక శక్తి వల్ల ఎగిసిపడే పెద్ద పెద్ద మంటలవి. ఈ మంటలే మనకు మచ్చలుగా కనిపిస్తుంటాయి. గ్రహణం సమయంలో వీటిని గమనిస్తారు. ఇవి కూడా ఎల్ల కాలం ఉండవు. కొంతకాలం ఉండి మాయమవుతుంటాయి. వీటిని సన్‌స్పాట్స్ అంటున్నారు. ఈ సన్‌స్పాట్స్‌లో జరిగే మార్పులు భూవాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి కారణంగా కూడా తుఫానులు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయి. అనగా సూర్యునిలో జరిగే మార్పులకు, భూమికి సంబంధం ఉన్నదని స్పష్టమవుతోంది. వీటిని సరి చేయడం ద్వారా ప్రాకృతిక ఉపద్రవాల నుంచి భూమిని, భూవాతావరణాన్ని రక్షించడం కోసం ఋషులు మనకు కొన్ని రకాల యజ్ఞప్రక్రియలను అందించారు. వాటిలో సప్తఛంధస్సులలో చివరిదైన జగతీ ఛంధస్సు కలిగిన మంత్రాలను పఠిస్తారు. ఇవి పఠించడానికి పట్టే సమయం చాలా ఎక్కువ. హోమగుండం కూడా భారీగా ఉంటుంది. అందువల్ల అందులో నుంచి యజ్ఞాగ్ని కూడా ఉధృతంగా ప్రజ్వరిల్లుతుంది. అటువంటి అగ్నిలో వేయబడిన హవనసామగ్రిలోని మూలికలు, ఇతర ద్రవ్యాలు అతి సూక్ష్మాణువులుగా విడిపోయి, తేలికపడి సూర్యమండలాన్ని కూడా చేరుతాయి. దాంతో అక్కడ ఏర్పడిన మచ్చల వల్ల సంభవించే విపత్తులను నివారించవచ్చు. అందుకే యజుర్వేదం జగతీఛంధస్సు, సూర్యుడిని, నక్షత్రలోకాలను వశపరుచుకుంటుందని చెప్తోంది.

సాధారణ యజ్ఞంలో వేయబడిన ఆవునెయ్యి, ఇతర సామగ్రి, సూక్ష్మీకరించబడి భూఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పై వరకు వెళుతుంది. అక్కడకు చేరు 10 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి, ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో మంత్రం కీలకపాత్ర పోషిస్తుంది. రాకెట్‌ను అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాడానికి, దాన్ని కేవలం ప్రయోగించి ఊరుకోరు. రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, కంప్యూటర్ల ద్వారా దానికి ఆదేశాలు పంపిస్తుంటారు. అట్లాగే యజ్ఞంలో కూడా. యజ్ఞంలో ఆహుతివ్వబడినవి అణువులుగా మారి, అంతరిక్షాన్ని చేరి, నిర్దేశిత ప్రయోజనాన్ని కలిగంచేందుకు వీలుగా, వాటి గతిని నిర్దేశిస్తుంది మంత్రం. మంత్రం యొక్క తరంగాలకు అంత శక్తి ఉంది. అవి కేవలం మర్త్యలోకన్నే కాదు, అనేకానేక ఇతర లోకాలను సైతం ప్రభావితం చేస్తాయి. ఇందులో ఛంధస్సు ప్రధానం. ఏదో మామూలుగా మంత్రం పఠిస్తే సరిపోదు. మంత్రాన్ని ఛంధోబద్ధంగా చదవాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. ప్రయోగశాలలో ఒక వాయువును ఉత్పత్తి చేయటానికి కొన్ని నిర్దేశిత పద్ధతులను పాఠిస్తారు రసాయనశాస్త్ర విద్యార్ధులు. ఎలా పడితే అలా, ఎప్పుడంటే అప్పుడు రసాయనాల కలపరు. దానికి నిర్దేశిత పరిణామం ఉంటుంది. రసాయనచర్య జరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలం కనపడుతుంది. యజ్ఞంలో కూడా అంతే. దానికి ఛంధస్సు ఉపయోగపడుతుంది.


To be continued ......................

ఈ రచనకు సహాయపడిన గ్రంధం: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వారా.' 

No comments:

Post a Comment