Thursday 3 August 2023

శ్రీదత్త పురాణము (216)

 


చాంఘిక గాధ


పూర్వం కృతయుగంలో పురందర అనే పట్టణంలో చాంఫ్రికుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడి భార్యపేరు భామ, అన్యోన్య దాంపత్యం ఇద్దరిదీ. చాంద్రీకునికి ఇంద్ర పదవినధిష్టించాలని కోరిక, తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అని ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరి భూగోళం అంతా సంచరించి, పర్వతాలూ, అరణ్యాలూ, నదీతీరాలు, సరోవరాలు గాలించారు. ఎక్కడా వారికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. దిగులుగా కూర్చున్నారు.


అప్పుడు అతడి పితృదేవతలు దుర్ధర్షులు అదృశ్యరూపాలలో ఆకాశాన నిలబడి - నాయనా వృధాగా కాలయాపన చేసుకుంటున్నావు. మూఢుడవై తీర్థాలు తిరుగుతున్నావు. వెంటనే బయలుదేరి మాతృతీర్ధం చేరుకో, అక్కడ పితృణముక్తిపొందు. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు పిండప్రదానం చేస్తే అధికర్తకూ, పితృదేవతలకు సద్గతులు కలిగిస్తుంది. అంచేత మిగతా తీర్థాలన్నీ నిరర్థకాలు, వాటి సంగతి మర్చిపో వెంటనే మాతృతీర్ధం చేరుకో - అని సలహా ఇచ్చారు. అందుమీదట చాంఘ్రకుడు వెంటనే బయలుదేరాడు. సహ్యాద్రిమీద దత్తాత్రేయాశ్రమం చేరుకుని యేరుతటాకంలో స్నానం చేసి మాతృతీర్ధంలో పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టి చెంతనే గట్టుమీద  ఉన్న కృష్ణామలకం క్రింద పిండప్రదాన శ్రాద్ధ విధులు నిర్వహించాడు. ఆ క్షణంలోనే అతని పితృదేవతలు ముక్తులై అక్షయ పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు.


No comments:

Post a Comment