Sunday 6 April 2014

చావో రేవో ఆలోచించండి

ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రతి రాజకీయపార్టీ ప్రచారంలో మునిగిపోయింది. కుల సంఘాలు, మతపెద్దలు ఏ పార్టీలకు ఓటు చేయాలో చెప్తున్నారు. ఇటువంటి సమయంలో హిందువులు ఓటు వేసే ముందు కొన్ని నిజాలు తెలుసుకోండి.

కాంగ్రెస్ ముస్లిం, ఇతర మైనారటీ సంస్థలను మెప్పించడానికి మతహింస నిరోధక బిల్లు 2011 తెచ్చింది. దీనిలో స్వల్పమార్పులతో మతహింసనిరోధక బిల్లు 2014ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ మతహింస నిరోధక బిల్లు గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలి.

మతహింస నిరోధక బిల్లు - దేశంలో మతహింసను నిరోధించడానికి, లౌకికవాదాన్ని(సెక్యులరిసం) కాపాడటానికి ఉపకరిస్తుందని ఈ బిల్లు చేసిన సభ్యుల అభిప్రాయం. ఆ బిల్లు ఏం చెప్తుందో చూడండి.

ఈ బిల్లు ప్రకారం మెజారటిలు అంటే కేవలం ఓ.సి., బీ.సి, హిందువులు మాత్రమే, ఎస్సి.,ఎస్టీలు హిందువుల చేత పీడింపడుతున్నవారు. మైనారటీలు అంటే ఇతర మతస్థులు, ఎస్సీ, ఎస్టీలు. ఈ బిల్లు కేవలం హిందువులకే వర్తిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం దేశంలో ఉన్న హిందువులంతా సహజంగానే దోషులు, నేరస్థులు, హింసను ప్రేరేపించేవారు, ఆందోళంకారులు. దేశంలో మేజార్టీశాతం ఉన్నారు కనుక హిందువులు మాత్రమే దేశంలో భయాందోళనలు సృష్టిస్తారు. ఇదే ప్రధాన అంశం. అందువల్ల దేశంలో ఎక్కడ మతఘర్షణ జరిగినా, ఎక్కడ ఉగ్రవాదులు బాంబు పేల్చినా, నిజానిజాలతో సంబంధం లేకుండా, ఎవరు చేశారు, ఏ దేశం యొక్క ప్రోద్బలంతో చేశారన్నది కూడా పట్టించుకోకుండా దానికి హిందూ సమాజాన్నే బాధ్యులను చేస్తుంది ఈ బిల్లు. అంటే ఉగ్రవాదుల దాడి జరిగితే, దాడి చేసినవారిని కాకుండా, దేశంలో హిందువులు మెజారటీ కనుక వారినే అరెస్ట్ చేస్తారు. అది ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న హిందునాయకులను, పీఠాధిపతులను జైల్లో వేస్తారు. ఇతర మతస్థులు దాడు చేశారనంటే ఈ బిల్లు అంగీకరించదు.

మెజారీటీ జనాభా అధికంగా ఒక ప్రాంతంలో చేరితే, అది ఉద్రిక్తతకు, ఆందోళనకు దారి తీస్తుందన్నది, ఇతర మతస్థులపై దాడులకు కారణమవుతుందని ఈ బిల్లు చెప్తుంది. కనుక హిందువులు అందరూ ఒక చోట చేరే సభలను, ర్యాలీలను, ఉత్సవాలను ప్రభుత్వం నిషేధించవచ్చు. అంటే వినాయకచవితి, దుర్గానవరాత్రి, బతుకమ్మ, జాతరలు మొదలైనవి ఈ బిల్లు ప్రకారం నిషేధింపబడతాయి.

ఈ బిల్లు హైందవేతరుల మనోభావల గురించి నొక్కి చెప్తుంది. హిందువులు ఇతర మతస్థుల మనోభాలను ఏ విధంగా దెబ్బ తీసినా, హిందువులు శిక్షార్షులు. మీరు అవతలవారిని దూషించవలసిన అవసరంలేదు. వారి భయాందోళనలకు హిందువే కారణం అన్న ఒక చిన్న కంప్లైంట్ చాలు, నాన్-బెయిలబుల్ కేస్ క్రింద హిందువులను జైల్లో పెడతారు.

మనోభావాలు దెబ్బతీయడం అంటే? ఉదాహరణకు మీ ఇంట్లో మీరు దైవానికి పూజ చేసుకుంటున్నారు. ఒక హైందవేతరుడు వచ్చి, మీరు పూజిస్తున్న దైవాన్ని ప్రక్కకుతోసి తన దైవాన్ని పెడితే, మీరు నోరు మూసుకుని పూజ చేయాలి. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించినా, నేను ఒప్పుకోను అన్నా, అతని మనోభావలు గాయపరిచినవారవుతారు. అతను కంప్లైంట్ చేస్తే కనుక మీరు శిక్షార్హులు. ఇదే కాదు, మిమ్మల్ని మతం మారమని బలవంత పెట్టినా, నేను మారను అని మీరు సమాధనం చెప్తే, అది వారి మనోభావలను దెబ్బతీయటమేనట. ఇక్కడ జరిగిన సంఘటన్ గురించి ఈ చట్టానికి అనవసరం. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అన్నదే ప్రధానం.

ఇక భయాందోళనల విషయానికి వద్దాం. హిందువులు ఒక చోట ఉత్సవం పేరున గుమ్మిగూడటం మాలో భయాన్ని కలిగిస్తోందన్న ఒక్క కంప్లైంట్ చాలు హైందవేతరుల నుంచి, ఆ ఉత్సవాన్ని నిషేధించవచ్చు. బిల్లు ప్రకారం ఇంట్లో పూజ సమయంలో గంటలు కొట్టడం, దేవాలయాల్లో సుప్రభాతాలు పెట్టడం, లౌడ్ స్పీకర్లలో ప్రవచనాలు చెప్పడం కూడా బ్యాన్ చేయబడతాయి. అసలు ప్రవచనాలు, ధర్మప్రచారాలను నిషేధించినా ఆశ్చర్యపడనవసరంలేదు. ఈ బిల్లు అమలైతే సంగీత కచేరీలు, భరతనాట్యాలు ఇక కలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కచేరీలో మన భగవంతుని గుణగణాలను మెచ్చుకుంటాం, కచేరి పేరిన ఈ హిందువులు తమ దేవుడే గొప్పని చెప్పుకుంటున్నారని వారి కంప్లైంట్ చేసినా అది వర్తిస్తుంది.

పిండప్రధాలు, తర్పణాలు చేయడం, శవాలను ఊరేగించడం వలన మాకు భయం వేస్తోంది అని ఏ హైందవేతరుడు కంప్లైంట్ చేసినా శవయాత్రలు, పిండప్రధానాలు, శ్రద్ధకర్మలు నిషేధిస్తారు. మీ ఇంట్లో మీరు చేసుకున్నా, మీ పక్క ఇంట్లో ఉన్నవాడు కంప్లైంట్ చేస్తే, వాడిని భయపెట్టినందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారు.

పెళ్ళి సమయంలో మ్రోగించే మంగళవాయిద్యాలు మాలో ఆందోళన కలిగిస్తున్నాయి, ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే చాలు, ఆ పెళ్ళివాళ్ళని జైల్లో పెట్టవచ్చు. వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, వేదపారాయణలు ఈ బిల్లుతో ఆగిపోయే పరిస్థితి. దేవాలయాలు పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.

ఒక ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు, ఒకరు హిందువు, మరొకరు హైందవేతరుడు. జనం అధికంగా హిందువు షాపులో వస్తువులు తీసుకుంటే, ఈ హిందువు నా వ్యాపారానికి అడ్డవస్తున్నాడు, ఇతని వల్లనే నేను నష్టపోతున్నాను, తద్వారా నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అన్న ఒక కంప్లైంట్‌తో ఆ హిందువు వ్యాపరిని అరెస్ట్ చేసి, అతడి వ్యాపారాన్ని, అస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని బిల్లు చెప్తోంది.

ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవినీతిపరుల ఆస్తిని జప్తు చేయాలని చట్టం చేయలేని రాజకీయపార్టీలు కేవలం నింద పడిన కారణంగా హిందువు ఆస్తిని స్వాధీనపరుచుకునే హక్కు కల్పించడం!

ఈ బిల్లులోని మరొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సాధారణంగా చట్టం ప్రకారం ఒక వ్యక్తి మీద పడిన నేరారోపణ ఋజువు అయ్యేవరకు అతడు కేవలం నిందితుడు మాత్రమే. ఋజువు చేస్తేనే అతడిని దోషిగా పరిగణించి శిక్ష వేస్తారు. కానీ మతహింస నిరోధక బిల్లు అందుకు పూర్తి విరుద్ధం. హిందువు మీద హైందవేతరుడు కంప్లైంట్ చేస్తే, దానికి సాక్ష్యం అవసరమేలేదు. నేను తప్పు చేయలేదని హిందువు నిరూపించుకునేవరకు అతడు దోషే. అతడు శిక్షార్హుడు. అతని ఆస్తిని జప్తు చేయవచ్చు. ఒకవేళ హైందవేతరుడే తప్పు కంప్లైంట్ ఇచ్చాడని తేలితే, అతని శిక్షపడదు, అతడిని విడిచిపెట్టేస్తారు. అదే బిల్లులో సుస్పష్టం.

ఈ బిల్లు ప్రకారం హిందువులపై 1950 నుంచి ఉన్న కేసులన్నీ రీఓపెన్ చేసి విచారణ చేపట్టవచ్చు. ఒక చిన్న కంప్లైంట్ చాలు. కానీ ఇది ఇతర మతాలవారికి వర్తించదు.

ఏదైనా ఒక రాష్ట్రంలో మతఘర్షణ జరుగుతుందన్న నెపంతో అక్కడున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి, కేంద్ర బలగాలను దింపి, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అమలు చేసే సదుపాయం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది, ఫెడరల్ వ్యవస్థను నాశనంచేస్తుంది.

ఈ బిల్లు మొత్తం హిందువుల గురించే మాట్లాడుతుంది. మైనారటీలు ఎన్ని అకృత్యాలు చేసినా దీనికి సంబంధం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ బిల్లు ప్రకారం మైనారటీలు చెప్పేవన్నీ నిజాలు, హిందువులు అబద్దాలకోరులు. దీనికి ప్రత్యేక కమీషన్ ఒకటి కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటవుతాయి. వాటికి ప్రత్యేక నిధి కూడా ఉంటుంది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటుంది.

ఇది కేవలం హిందువులు మెజారాటిలుగా ఉన్న రాష్ట్రాలకే పని చేస్తుంది. ఎక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారో, ఆ రాష్ట్రాల్లో ఏ చట్టం అమలు జరగదని బిల్లే స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఈ దేశంలో అల్లర్లకు హిందువులే కారణమట.

ఇంత దిక్కుమాలిన బిల్లును యూ.పీ.యే ప్రభుత్వం పార్లమెంటు రాజ్యసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఒక హిందూ దేశంలో హిందువులకు ఎంతో అన్యాయం చేసే ఈ బిల్లు మీద బీ.జే.పి. తప్ప ఇతర రాజకీయపార్టీలు స్పందించకపోవడం, తప్పని చెప్పకపోవడం ఈ దేశపు హిందువులు దౌర్భాగ్యం. ప్రతి చిన్న విషయాన్ని పదేపదే చూపించే మీడియా ఈ భయానక బిల్లు గురించి జనానికి చెప్పకపోవడం, మీడియా యొక్క కుహనాలౌకికవాదానికి నిదర్శనం.

కనీసం ఇప్పటికైనా హిందువులు కులాలకు అతీతంగా సంఘటితం కావాలి. తమదైన ఓటు బ్యాంకును నిర్ముచుకోవాలి. కేంద్రంలో హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మతాలను ఆదరిస్తూనే, హిందు ధర్మాన్ని ఆచరించాలి, కాపాడుకోవాలి.

కేంద్రంలో ఈసారి కూడా కూహనాలౌకికవాద ప్రభుత్వం ఏర్పడి ఈ చట్టం తీసుకువస్తే, ఈ దేశంలో హిందువులకు మూడే దారులు ఉంటాయి.

ఒకటి మతమార్చుకోవడం, రెండవ చచ్చిపోవడం, లేకుంటే బాధలు పడటం.

ఓటు వేసే ముందు కాస్త ఆలోచించండి. ముస్లింలు, క్రైస్తవులందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. హిందువులేమో కులాల పేరున కొట్టుకుచస్తున్నారు. కమ్మలు ఒక పార్టీకి, రెడ్లు ఒక పార్టీకి, కాపులు వేరే పార్టీకంటూ మనలో మనమే గుద్దుకుని ఓట్లు చీల్చుకుంటున్నాం. హిందువుల ఓట్లు కూడా గంపగుత్తగా ఒకే పార్టికి పడాలి. మనకోసం, మన ధర్మం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భారతదేశ రక్షణ కోసం.

ఇప్పుడు మనం రెండు పనులు చేయాలి. త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కనుక హిందువుల ఓట్లు చీలకుండా జాగ్రత పడాలి, మన గురించి మాట్లాడేవారిని గెలిపించుకోవాలి. దీర్ఘకాలంలో హిందువులంతా రాజకీయాలకు అతీతంగా ఒక ఉమ్మడి ఓటు బ్యాంకుగా మారాలి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అన్ని రాజకీయపార్టిలు హిందువులకు జై కొట్టాలి.

ఒక పక్క ఇల్లు తగలబడుతుంటే, వాటాల కొసం కొట్టుకుచావడమేమిటి? ముందు ఇల్లు తగలబడకుండా ఆపుదాం. ఆ తర్వాత మిగితా సంగతి చూసుకుందాం. ఓటు వేసే ముందు ఆలోచించండి.

1 comment: