Thursday 29 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (06)



సరస్వతి, నిన్ను అనుసరిస్తానని అంది కాబట్టి ఆమె విగ్రహము, శంకరుల విగ్రహానికి వెనుక ఉండడం కూడా సబబే.


శంకరులు, నా ముందు సాక్షాత్కరించుమని ప్రార్థించడం వల్ల హనుమ ముందున్నాడు. శంకరులు హనుమత్ పంచరత్నం వ్రాసేరు. అనగా ఐదు శ్లోకాలు, రుద్రాంశ సంభూతుడు ఇక్కడ ప్రార్ధింపబడ్డాడు. ప్రశంసించిన వ్యక్తి అయిన శంకరులు, శంకరుని అవతారం. ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ వినయ మూర్తులే. ఇద్దరూ బుద్ధిమంతులైనా వినయవంతులే. శంకరులెంత వినయంతో ప్రార్థిస్తారో గమనించండి:


పురతో మమపాతు హనుమతో మూర్తి:


నాముందు ఆంజనేయస్వామి ప్రకాశించుగాక. రక్షించుగాక. కనుక శంకరులు ముందు ఈ స్వామి మూర్తి ఉండడం సబబే. అట్లా ఉంటేనే శంకరులకిష్టం.


ఆది, అంతమూ రెండూ ఒక్కటే. అద్వైత సత్యం. నేనుతో ఆరంభమై నేనుతో అంతమౌతుంది. (జీవాహంకారం నుండి మొదలై పూర్ణాహంకారంతో ముగుస్తుంది. చివర రావలసిన ఆంజనేయుడు. గురువు కంటే ముందే రావడం అద్వైతాన్ని వివరిస్తోంది. దాసోహం అని తనను తాను రామచంద్రునికి అర్పించుకొనగా సోహం స్థితికి చేరుకొన్నాడు. అనగా వాడే నేను అనే స్థితి. నేను, పరమాత్మనే అనేస్థితి. అదే అద్వైతభావం. కనుక ఆది, అంతమూ అతడే.


No comments:

Post a Comment