Monday 5 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (223)



భగవన్నామ మాహాత్యం


ధ్యానం, జపం, పూజ, యజ్ఞం, తీర్థయాత్రలున్నట్లుగానే సామూహికంగా భజన చేయడమూ అనాదిగా ఉంది. పరమాత్మలో జీవాత్మను అనుసంధానం చేయడం కోసమే అనేక ప్రక్రియలున్నాయి. భజన పద్ధతి కూడా అందొక భాగం. గ్రామాలలో భజనలకై కొన్ని స్టలాలుండడం వల్ల చాలా కాలం నుండి ఈ సంప్రదాయం అవిచ్చిన్నంగా సాగుతోంది. శనివారాలలోగాని, ఏకాదశి వంటి పర్వదినాలలోగాని చాలా మంది భజన చేస్తూ ఉంటారు.


ఆలయాలలో పూజ, ధ్యానాదులున్నా భజనలలో ఉచ్చ స్వరంతో గానం చేస్తారు. స్వామి గుణాలను, నామాలను కీర్తిస్తారు. అందరూ కలసి పాడుతారు. సంఘ దృష్టితో సామూహికంగా జరిగేదిది. ఎవరి ముక్తికై వారు ప్రయత్నం చేయడమే కాకుండా ఆలయాల ద్వారా, భజనల ద్వారా, ఉత్సవాల ద్వారా సామూహికంగా కూడా ఉంటుంది. భజనలలో తాళమృదంగాది వాద్య సహకారంతో వినసొంపుగా ఉంటుంది. మనస్సు ఏకాగ్ర మవడానికి దోహదం చేస్తుంది. రఘుపతి రాఘవ రాజారాం, హరేరామ హరేరామ రామరామ హరేహారే అనే నామ స్మరణ ద్వారా భగవానుణ్ణి తలుచుకోవడం అప్రయత్నంగా సాగుతుంది.


ఒక చోట కూర్చొని చేయడమే కాకుండా నగర సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు. పర్వదినంనాడు అందరూ కలసి అన్ని వీథులు తిరిగి సంకీర్తనం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మార్గశిర మాసంలో సంకీర్తనాలు ఉంటాయి.

No comments:

Post a Comment