Friday 2 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (220)



వైద్యాలయాలు కేవలం శారీరక అనారోగ్యాన్ని తొలగించగలవు. అంతకంటే మనుష్యులలో దుష్టభావాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని కోసం పాఠశాలలను పెట్టి చదువు నేర్పిస్తున్నాం. వాళ్లు బాగా చదివి లోకంలో అడుగుపెట్టి నిజాయితీతో ఉండకపోతే ఆ చదువువల్ల ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది? ఆ విద్యార్థిలో క్రమశిక్షణ, త్యాగబుద్ధి, దేశభక్తి, దైవభక్తి లేకపోతే వాడు బుద్ధిమంతుడైన కొద్దీ ఎట్లా మోసం చేయవచ్చో, నేరాన్నుండి ఎట్లా తప్పించుకోవచ్చో మొదలగువాటికి ఆ విద్య ఉపకరిస్తోంది కూడా. కనుక మానవ జీవితం వైద్య, విద్యాలయాలతోనే అంతం కాదు. వాటికి తోడు దేవాలయ వ్యవస్థ ఉండి తీరాలి. మనిషిని మహోత్తమ మానవునిగా తీర్చి దిద్దాలంటే వానిలో ధ్యానం, పూజ, ప్రశాంత చిత్తత, వివేచన వినయ సంపద, క్రమశిక్షణ మొదలయిన సల్లక్షణాలుండవలసిందే. వీటికై ఉపయోగిస్తుంది దేవాలయం.


ఆరోగ్యం విద్య అందించడం కంటే భగవత్ సాన్నిధ్యాన్ని చేర్చే పద్ధతి ఉండాలి. విద్య వల్ల బుద్ధి మంతుడౌతాడు. ఆ బుద్ధి తనకు, సంఘానికి ఉపయోగపడినపుడే ఆ విద్యకు పరమార్ధం. అంతకంటే జ్ఞానికావాలి. విచక్షణా జ్ఞానం ఉండాలి. (Knowledge వేరు wisdom వేరు). ఈ జ్ఞానం పూజ ధ్యానాదుల వల్ల వస్తుంది. మంచి వ్యక్తులుగా మారినపుడు పై విద్యలు రాణిస్తాయి.


ఈ మంచిగా మారడానికి దేవాలయ సంరక్షణ జరగాలి. ముందుగా భక్తి భావం పొటమరించాలి. తనను తానేమిటో తెలిసికొనే వాతావరణాన్ని సృష్టించగలగాలి.


No comments:

Post a Comment