Wednesday 15 September 2021

గణపతిని ప్రసన్నం చేసికొనుటకు 3 మర్గాలు


గణేశునికి గరిక అత్యంత ఇష్టం అని తెలుసు కదా. ఒకసారి గరికను సమర్పించిన తర్వాత ఇక ఏమీ సమర్పించకూడదని చెప్పుకున్నాము. అంటే గరిక అనేది గణపతి ఆగమాల్లో ఉత్కరిష్టమైనది. భక్తుని దగ్గర ఏమీ లేకున్నా కేవలం గరికను సమర్పించి వేసుకుంటే చాలు, కార్యం సిద్ధిస్తుంది. అయితే విష్ణు ఆరాధనలో తులసిని ఏ విధంగానైతే ప్రసాదాల మీద, తీర్థం యందు వేస్తారో, అలాగే గాణాపత్యంలో గణపతికి నివేదించే పదార్ధాల మీద గరిక పోచలు వేయాలి. 


శివునకు బిల్వం సమర్పించిన విధంగానే గణపతికి రెండు దుర్వాలు చొప్పున సమర్పించాలి. ఒక దుర్వాన్ని ఎప్పుడూ అర్పించకూడదు. 


గాణాపాత్యులు తమ దేవతార్చనలో తులసిని ఎన్నడూ వాడరు. కారణం గణపతి పూజలో తులసి పనికిరాదన్న గణేశుడి శాపం. కేవలం వినాయక చవితి రోజున మాత్రమే తులసిని గణపతికి అర్పించాలి. అది కూడా మిగిలిన 20 రకాల పత్రాలు లభ్యమైనప్పుడు మత్రమే, 21 వ పత్రిగా తులసిని అర్పించవచ్చు.


ఇక గణపతిని ప్రసన్నం చేసుకోనుటకు మరొక మార్గం కొబ్బరికాయ కొట్టడం. త్రిపురాసుర సంహారం ముందు విఘ్నం తొలగుటకు సాక్షాత్తు శివుడే కొబ్బరి కాయ కొట్టాడు గణపతి ముందు. 


దీని గురించి కంచి పరమాచార్య వారు విపులంగా చెప్పాలి. ఆర్థిక స్తోమత కలిగిన వారందరూ కనీసం ప్రతి శుక్రవారం గణపతికి కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి పేదలకు, చిన్న పిల్లలకు పంచాలి. ఇది అన్ని రకాల అభివృద్ధిని ఇస్తుంది. ఇంకొక ఉపచారం - ప్రదక్షిణలు చేయుట. మనం ఒక పని జరగాలని గణపతిని కోరుకొని ప్రదక్షిణలు నిత్యం చేస్తూ ఉంటే కార్య సిద్ది కలుగుతుంది. ఒకవేళ ఈ రెండు విషయాలు లోకులు అర్ధమయ్యి అందరూ ఆ ఫలితాలను పొందడం మొదలుపెడితే, ఇప్పుడున్న గణపతి ఆలయాలు సరిపోవని, ఇంకా కొత్తవి చాలా కట్టవలసి వస్తుందని పరమాచార్యుల వారు చెప్పి ఉన్నారు.


కాబట్టి గణపతిని ప్రసన్నం చేసికొనుటకు మనం ఈ మర్గాలను పాటించవచ్చు.


ఓం శ్రీ గణేశాయ నమః   

No comments:

Post a Comment