Friday 24 September 2021

పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి



పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి. ఆ మాటకు వస్తే రోజూ ఒక్కసారైనా వారిని స్మరించాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఉద్యోగ్యం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతానం, కుటుంబంలో సఖ్యత మొదలైనవి ఉంటాయి. వంశం కొనసాగుతుంది.


బయట చాలా వింత పోకడలు కనిపిస్తున్నాయి. గతించినవారికి పిండాలు పెట్టడమేంటి, అది వారికి చేరుతుందా? ఇదంతా బ్రాహ్మణుల కుట్ర, బ్రాహ్మణులు పొట్ట నింపుకోవడం కోసం ఇవన్నీ చెబుతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. పితృకర్మల్లో భక్తి,శ్రద్ధ, విశ్వాసాలు ప్రధానం. వీటికి తార్కికమైన వివరణల కోసం వెతకకండి.  


మహాలయ పక్షాల్లోనైనా పితరులకు పిండప్రధానాలు, తర్పణాలు వదిలి చూడండి. వచ్చే ఏడాదికి జీవితంలో ఎంత అభివృద్ధి కలుగుతుందో మీరే చూస్తారు. పితరుల పేరున అన్నదానం చేయాలనుకోవడం మంచిదే. కానీ అన్నదానం అనేది శ్రాద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. దేనికదే. పితృకర్మ చేసిన బ్రాహ్మణునికి దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి.


పితృకర్మలు చేసే బ్రాహ్మణుడు సైతం చక్కని పండితుడై ఉండాలి. యక్షప్రశ్నల్లో మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. శ్రాద్ధానికి ఏది తగిన కాలము అని యక్షుడు అడిగితే, దానికి "ఉత్తమ బ్రాహ్మణుడు దొరికిన కాలామే శ్రాద్ధానికి తగిన కాలము" అని ధర్మరాజు బదులిస్తాడు. శ్రాద్ధం ఎట్లా చెడిపోయినదవుతుంది అని యక్షుడు అడగ్గా వేదము చదివిన బ్రాహ్మణుడు లేకుండా పెట్టిన శ్రాద్ధము వ్యర్ధమవుతుందని ధర్మరాజు బదులిస్తాడు.  


దేవకార్యాల్లోనైనా ప్రయత్నలోపం ఉంటే దేవతలు సర్దుకుంటారేమో గానీ పితృకార్యాల్లో మాత్రం శాస్త్రవిధిని తప్పక పాటించాలి. మాకు పిండప్రధానం చేసి ఆచారం లేదండీ అనడానికి లేదు. మీ ఇంట్లో ఇంతకమునుపు ఇటువంటి ఆచారాం లేకున్నా మొదలుపెట్టాలి. మీరు ఏ వర్ణం వారైనా తప్పనిసరిగా పిండప్రధానాలు చేయాలి, తర్పణాలు వదలాలి. ఏది చేసినా అది మీ కుటుంబ వృద్ధి కోసమేనని గమనించాలి.  

No comments:

Post a Comment