Friday 17 September 2021

గాణాపత్యం - గురుమండలం



గాణాపత్యం కూడా ఒక విస్తారమైన మతము. మహారాష్ట్రలో ఇప్పటికీ గాణాపత్యులు ఉన్నారు. గాణాపత్యంలో మొత్తం 64 మంది గురువులతో గురుమండలం ఉంది. గణపతి మంత్ర ద్రష్ట గణక ఋషి. దత్తాత్రేయుడు, గౌడపాదాచార్యులు మొదలైన వారు ఈ పరంపరలో కనిపిస్తారు.  


వినాయక రహస్యం అనే ఒక గొప్ప గాణాపత్య గ్రంథం ఉంది. అందులో భవిష్యవాణి ఈ విధంగా చెప్పబడింది. "కలియుగంలో ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, గాణాపత్యంలోని పరమగురువైన గణక ఋషి ప్రయాగ వద్ద గౌడపాదులుగా అవతరిస్తారు. ఆయన తన శిష్యులకు జ్ఞానబోధ చేసి మోక్షమార్గం చూపుతారు. ఆయనకు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి గొప్ప శిష్యునిగా మారుతారు. అద్వైతవేదాంతాన్ని, వేదసారాన్ని వ్యాప్తి చేయడంలో ఈయన కీలకుడవుతాడు. 10 ఉపనిషత్తులకు వ్యాఖ్య రాసి మహావాక్యాల యొక్క సారన్ని బోధ చేస్తారు."  


గౌడపాదుల బోధలకు సమానమైనవి మనకు ముద్గల పురాణంలో సైతం కనిపిస్తాయి. ఇలా గణేశ భక్తులకు అద్వైత సంప్రదాయ రక్షణ మరియు వ్యాప్తి అనేది ముఖ్యమైన కర్తవ్యం. 


అయితే గాణాపత్యంలో బుద్ధుడిని కూడా గురుమండలంలో ఒక ఆచార్యునిగా గౌరవిస్తారు. గణపతి సహస్రనామంలో కూడా జైన, బౌద్ధ మతాల రూపంలో కూడా గణపతి ఉన్నాడని ప్రస్తావన కన్పిస్తుంది.  


ఓం శ్రీ గణేశాయ నమః 

No comments:

Post a Comment