Thursday 30 September 2021

శ్రీ హనుమద్భాగవతము (41)



చివరకు భగవానుడైన శ్రీరాముడు ప్రసన్నుడై నాకు ఈ వానరము కావాలని మారాము చేసాడు. చక్రవర్తియైన దశరథమహారాజునకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని కోరిక నెఱవేరకుండా ఎలా ఉంటుంది. భిక్షకుడు ఎంతటి మూల్యం తీసుకున్నా వానరము మాత్రము శ్రీ రాముని దగ్గర ఉన్డవలసినదే. భిక్షుకునకు కూడా ఇదియే ఇష్టము. తన ప్రభువు చరణాలకు సమర్పితము కావాలనే ఉద్దేశ్యముతోనే అతడు రాజద్వారము దగ్గర వచ్చాడు. నూతనజలధర (మేఘ) చ్ఛాయ వంటి తనువు గల శ్రీరాముడు తన కరకమలములతో వానరమును తీసుకున్నాడు. యుగయుగములనుండి ఉన్న ఆ వానరము యొక్క కోరిక నేటికి నెఱవేరినది. అది వివిధరీతుల నాట్యము చేసినది. ఇంతవఱకును పరమశివుడు వానర రూపమున తన్ను తాను నాట్యము చేయుంచుకొనుచుండెను. ప్రస్తుతం ఆయనే నాట్యము చేయుచున్నాడు. ఆయనను నాట్యము చేయించువాడు మునిమనో మానసమరాళమగు దశరథ కుమారుడే. ఆ వానరముయొక్క సుఖమునకు, సౌభాగ్యమునకు, ఆనందమునకు హద్దుయే లేకుండెను. అది వివిధరీతుల మనోమోహకములైన హావభావాలను ప్రదర్సితూ తన ప్రభువు ఎదుట నృత్యము చేయుటలో తన్మయత్వము చెంది యుంన్నాడు. భిక్షకుడు అదృశ్యమయ్యాడు. ఆయన కైలాసశిఖరమునకు వెడలినాడా లేక తన ప్రభువులీలను దర్శించుటకు మఱియొక రూపమును ధరింనాడా అనే విషయము తెలియలేదు.


ఇట్లు హనుమంతునకు తన స్వామియైనశ్రీ రాముని దగ్గర నుండు అవసరము కలిగినది. శ్రీరాముడు హనుమంతుని ఎక్కువగా ప్రేమించుచున్నాడు. ఆయన హనుమంతునిసమీపంలో కూర్చిన్నాడు, వానితో ఆడేవాడు. బంగారు వంటి అతని శరీరాన్ని తన కరకమలముతో నిమిరేవాడు. ఒకప్పుడు నృత్యము చేయుటకు వానికి అనుమతియిచ్చేవాడు, మఱియొకప్పుడు పరుగెత్తించి వస్తువు ఒకదానిని అతనిచే తెప్పించేవాడు. హనుమంతుడు తన ప్రభువిచ్చు ఏ ఆజ్ఞనైనా ఎంతో ఆదరము తోనూ, ఉత్సాహముతోనూ, సంతోషముతోనూ నెఱవేఱర్చును. అతడు అనేక విధాలుగా శ్రీ రాముని సంతోష పెట్టేవాడు.


ఇట్లా ఎన్నో సంవత్సరాలు అర్థ క్షణము వలె గడచి పోయాయి. విశ్వామిత్రమహర్షి అయోధ్యకు విచ్చెసాడు. ఆయనతో వెడలవలసిన అవసరము గలిగినపుడు శ్రీరాముడు హనుమంతుని ఒన్టరిగా పిలచి ఇలా పలికాడు. మిత్రుడవగు హనుమా! నేనీ భూమిపై అవతరించుటకు గల ప్రధానకార్యమిప్పుడు ఆరంభం కాబోతున్నది. లంకాధిపతియైన రావణుని దుశ్చేష్టలచే పృథివి వికలమైనది. ఇప్పుడు నేను వానిని వధించి పుడమిపై ధర్మమును నిలబెడతాను. ఈ కార్యమున నీవు నాకు సహాయపడాలి. దశాననుడు మహాబలియైన వాలితో స్నేహం చేసుకొన్నాడు.

No comments:

Post a Comment