Tuesday 7 September 2021

శ్రీ హనుమద్భాగవతము (35)



“నీకు సర్వవిధముల శుభము కలుగుగాక అని సూర్యభగవానుడు ఆశీర్వదించగా కేసరీనందనుడు గురు దేవునకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


విద్వాంసుడైన పవనకుమారుడు గంధమాధనపర్వతమునకు తిరిగివచ్చి తన తల్లిదండ్రుల చరణములకు నమస్కరించాడు. తల్లిదండ్రుల సంతోషములకు అవధులు లేకపోయాయి. ఆ సమయములో వారి ఇన్టిలో ఒక గొప్ప ఉత్సవము జరుపబడినది. గంధమాదనపర్వతముపై హర్షోల్లాసములతో కూడిన ఉత్సవము ఇంత సుందరముగా ఇన్త పెద్దయెత్తున ఇంతకు పూర్వమెప్పుడును జరిగి ఉన్డలేదు. ఇట్టి దానినెవ్వరు చూచి కూడా ఉండలేదు. వానర సముదాయమంతా మహదానందమున మగ్నమైయుండింది. అందఱు తమ ప్రాణములకంటెను ప్రియుడైన అంజనానందనుని మనసారా ఆశీర్వదించారు.


శ్రీ సువర్చలా కల్యాణ రహస్యము


విశ్వకర్మకు ఛాయ అనే సర్వగుణ సంపన్నురాలగు పుత్రిక కలదు, ఆమె సూర్య దేవుని ఉపాసించింది. విశ్వకర్మ తన పుత్రికమనస్సును తెలుసుకొన్నవాడై ఆమెను సూర్యభగవానునకు అర్పించెను. శ్రీ సూర్య భగవానుడు ప్రచండమైన అగ్ని తేజముతో విరాజిల్లి ఉన్నాడు. ఛాయా దేవి ఆ మహా తేజాన్ని భరించలేక తల్లికి తెలిపింది. తన భార్య వలన విషయమును తెలుసుకొన్నవాడై విశ్వకర్మ తన తపశ్శక్తితో సూర్యుని నుండి ప్రచండ తేజమును వేరు చేసాడు. దానినే సూర్య గోళమని అంటారు. తన నుండి వేరైన తేజఃపుంజముపై శ్రీ సూర్య భగవానుడు తనదృష్టిని సారించాడు. ఆ మహా తేజము నుండి సూర్యుని మానసపుత్రిక, అయోనిజ, అతిలోక సౌందర్యవతి, సకలసద్గుణ సంపన్నురాలు, శ్రీపార్వతీ దేవియొక్క పూర్ణాంశ అయిన సువర్చల ఆవిర్భవించింది. బ్రహ్మాది దేవతలందఱు ఆ మహా తేజమును చూసి పరమాశ్చర్యచకితులైరి. ఇంద్రాది దేవతలు బ్రహ్మ దేవుడు సువర్చలా దేవికి భర్త ఎవ్వరు కాగలరని ప్రశ్నించారు. అందులకు బ్రహ్మ ఇట్లు పలికాడు,


శ్లో! ఈశ్వరస్య మహత్తేజో-హనునూమాన్దివి భాస్కరమ్ 

ఫలబుద్ధ్యాతు గృష్ణాయాత్ - కస్య భార్యా భవిష్యతిః |


సదాశివుని తేజోరూపుడగు శ్రీ ఆంజనేయుడు ఆకాశంలోనున్న సూర్యుని ఫలమనుకొని పట్టుకొనుటకు ప్రయత్నింపగలడు. 'ఆ హనుమంతునకు సువర్చల భార్య కాగలదు. కాలానుసారముగ శ్రీహరిహర తేజము శ్రీ ఆంజనేయునిగా అవతరిస్తుంది.


శ్లో ఆంజనేయస్తతః కాలే- బ్రహ్మచర్యపరాయణః 

సమర్థోఽపి మహా తేజః సంపశ్యన్లోక సంగ్రహమ్ | - 

సూర్యమండల ముత్పత్య - వేదాధ్యయన కారణాత్ 

స ప్రశయ మువాచేదం-నమస్కృత్య దివాకరమ్ | 


శ్రీ ఆంజనేయుడు బ్రహ్మచర్యనిష్ఠాగరిష్టుడు, సర్వజ్ఞానసంపన్నుడు, సర్వసమర్థుడునైనా లోకానికి ఆదర్శము చూపటం కోసం వేదాధ్యయనమును కారణముగా చేసుకుని సూర్య భగవానునకు నమస్కరించాడు. విద్యార్థియై పరావిద్యను అర్థించాడు. అందులకు శ్రీసూర్య భగవానుడు సానందముగ సమ్మతించాడు.


No comments:

Post a Comment