Saturday 18 September 2021

గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైన మూడు పువ్వులు



గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైనది, గణపతి త్వరగా సంతుష్టుడయ్యేది మూడింటితో. అవి గరిక, మందార పుష్పం మరియు శమీ పుష్పాలు.


దుర్వా గంధ మాత్రేణ సంతుష్ఠోసి గణాధిపః ||


గరిక పోచల వాసన తగలడంతోనే గణపతి సంతుష్ఠుడవుతాడు.


అయితే గరిక వాసన ఆయనకు ఎప్పుడు తగులుతుంది ? ముక్కుకు దగ్గరగా పెట్టుకున్నప్పుడు. అంటే గణేశుడి తొండానికి దగ్గరగా దుర్వా ఉంచినప్పుడు ఆయన సంతుష్ఠుడవుతాడు. అందుకే యోగిన్ద్ర మఠం (గాణాపత్య మఠం) పరంపరలో అర్చనా క్రమాన్ని ఈ విధంగా చెప్పారు.


ముందు అన్ని రకాల సుగంధ పుష్పాలతో అర్చన ప్రారంభించాలి. వాటి తరవాత ఎఱ్ఱని పుష్పాలు. తర్వాత బిల్వ పత్రాలు, బిల్వం మీద శమీ పుష్పాలు, వాటి మీద అర్క పుష్పాలు. జిల్లేడు పువ్వుల్లో నీలి రంగువి కనిష్టం, ఎరుపు మధ్యమం, తెలుపు శ్రేష్ఠం. కనుక నీలి అర్కపుష్పాల, వాటి మీద ఎఱుపు, ఆ తర్వాత తెల్లజిల్లేడు పూలు అర్పించాలి. వాటి మీద గరిక సమర్పించాలి. అందులోను పచ్చని దుర్వాలు, వాటి తరువాత శ్వేత దుర్వాలు అర్పించాలి.  


ఒకసారి దుర్వాలు అర్పించిన తర్వాత ఇక గణేశుడికి ఏదీ అర్పించకూడదు. దుర్వాల తర్వాత ఇక ఉత్తరపూజ అనగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.   

No comments:

Post a Comment