Wednesday 22 September 2021

శ్రీ హనుమద్భాగవతము (39)



శిశువురూషముతో నున్న శ్రీరాముని కలియుట


కర్పూరగౌరుడగు శివునిలోను, నీల కళేబరుడుగు శ్రీరామునిలోను అనన్యమగు ప్రేమగలదు. భగవానుడగు శ్రీ రాముడు మహేశ్వరుడు వాస్తవముగా ఒకే తత్త్వమై యున్నారు. వారిలో ఎలాంటి భేదము లేదనే విషయము సత్యమైనది. కనుకనే "గోవిందునకు నమస్కరించువాడు శంకరునకు కూడా నమస్కరిస్తాడు. అట్లే భక్తిపూర్వకముగా శ్రీహరి నర్చించు వాడు వృషభధ్వజుడగు శివుని కూడా అర్చింస్తాడు. విరూపాక్షుని ద్వేషించువాడు జనార్దనుని కూడా ద్వేషిస్తాడు. అట్లే రుద్రుని తెలుసుకోలేనివాడూ అనగా రుద్రరూపము తెలియనివాడు కేశవుని కూడా తెలుసుకోలేడు* 1 –


* -1 హే నమస్యంతి గోవిందం తే సమస్యంతి శంకరమ్ |

యేఽర్పయంతి హరిం భక్త్యా తేఽర్చయంతి వృషధ్వజమ్' || 

యే ద్విషంతి నిరూపాక్షం తే ద్విషంతి జనార్ధనమ్ |

'యే రుద్రం నాభిజానరతి తేన జానంతి కేశవమ్ ||

(రుద్రహృదయోపనిషత్  6_7)


అవ్యక్తుడగు ఈ విష్ణువును, మహేశ్వరుడైన నన్ను ఒకే విధముగా చూసేవానికీ పునర్జన్మ ఉండదని భగవానుడైన శంకరుడు స్వయముగా చెప్పాడు. *2  కాని రసమయము మధురము అయిన తమ లీలలను ప్రదర్శించుటకే శీఘ్రసంతుష్టుడగు శివుడు, మునిమనోరంజనుడగు కేశవుడు వివిధ రూపముల ధరించుచుందురు.

*2 యే త్వేనం విష్ణుమవ్యక్తం మాంచ దేవం మహేశ్వరమ్.... 

ఏకీభావేన పశ్యంతి వ తేషాం పునరుద్భవః ॥ (కూర్మపురాణము - ఈశ్వరగీత)

పాపతాపములు నివారించుటకు, ధర్మమును స్థాపించుటకు, ప్రాణుల హితము కొఱకు శ్రీ రాముడీ భూమిపై అవతరిస్తూ ఉంటాడు. అట్లే సర్వలోకమహేశ్వరుడైన శివుడు గూడ అవతరించుచుండును. అట్లాగే సర్వలోకమహేశ్వరుడైన శివుడు కూడా తనకు ప్రియమైన శ్రీ రాముని మునిమనోవెహకము, మధురము, మంగళమయమైన లీలలను దర్శించుటకు భూమిపై అవతరిస్తూ ఉంటాడు. ఆయన తన యొక్క అంశతో శ్రీరామునిలీలను సహాయము చేస్తాడు, మఱియొక రూపముతో లోకపావనమైన ఆయన లీలను దర్శించి సంతుష్టుడవుతూ ఉంటాడు, ఆ సమయముంలో ఆతని ఆనందానికి అవధులుండవు.

No comments:

Post a Comment