Friday 6 June 2014

హిందూ ధర్మం - 76 (అంబరీషుడి యాగపశువు అపహరణ)

పశ్చిమ దిక్కు వెళ్ళిన విశ్వామిత్రుడు పండులు, కందమూలాలు తింటూ సరోవరాల పక్కన కూర్చుని ఎవరు చేయలేని ఘోరమైన తపస్సు చేశాడు. ఇదే కాలంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్న అంబరీషుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. కానీ ఆ సమయంలో యజమాని యొక్క యాగపశువును ఇంద్రుడు దొంగిలించాడు. ఇది గమనించిన రాజపురోహితుడు 'రాజా! యాగం కోసం నీవు ఏర్పాటు చేసిన పశువు నీ అజాగ్రత్త వలన కనిపించకుండాపోయింది. యాగ సమయంలో రక్షింబడిన వస్తువులు యాగం చేసే రాజు పాలిట వినాశకాలు అవుతాయి. యాగం మధ్యలో ఆపడానికి వీలులేదు. కనుక నీవు దీనికి అనేక ప్రాయశ్చిత్తాలు చేయాలి. యాగపశువు లేదు కనుక అందుకు బదులుగా ఒక మనిషిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. అతడిని యాగపశువుగా భ్వాఇంచాలి. అప్పుడే తిరిగి యాగం ప్రారంభించబడుతుంది. ఈ మాటలు విన్న రాజు, యాగపశువుగా కూర్చునే వ్యక్తికి బదులుగా వేయి గోవులను దానం చేస్తానని ప్రకటించి అనేక ప్రయత్నాలుఇ చేశాడు. అడువులు, ఆశ్రమాలు, ఊర్లు అన్ని తిరిగుతూ రాజు ఋచికుడనే ఋషుని, అతని పరివారాన్ని భృంగతుంగ పర్వతం దగ్గర చూశాడు. మహాతేజోవంతుడు, అమితప్రతిభావంతుడైన ఋచికునకు నమస్కరించి బాగోగులు, అన్ని వివరాలు తెలుసుకున్న అంబరీషుడు ఋషితో 'ఓ భార్గవా! మీరు నాకు మీ కుమారుడీని యాగపశువు నిమిత్తం దానం చేయాలి. అందుకు బదులుగా నేను మీకు వేయి ఆవులను ఇస్తాను' అన్నాడు. అన్ని దేశాలు తిరిగాను కానీ యజ్ఞపశువు దొరకలేదు. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాను. మీ కుమారులలో ఎవరో ఒకరిని నాకు అప్పగించండి అన్నాడు అంబరీషుడు.

దానికి బదులిస్తూ ఋషి ఓ మహాత్మా! నేను నా పెద్ద కొడుకును ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను అన్నాడు(ఎందుకంటే పెద్ద కొడుకే తండ్రి చితి వెలిగించాలి). తన భర్త మాటలు విన్న ఋషిపత్ని 'నా భర్త పెడ్డకుమారుడని ఇవ్వలేనని తేల్చి చెప్పారు. నేను నా ఆఖరి కుమారుడని శునకుడను ఇవ్వలేను, అతనంటే నాకు చాలా ఇష్టం (చిన్న కొడుకే మరణించిన తల్లి చితి వెలిగించాలి). సాధారణంగా తండ్రికి పెద్ద కుమారుడి మీద, తల్లికి చిన్న కుమారుడి మీద అమితమైన ఇష్టం ఉంటుంది అని పలికింది. ఇది విన్న వారి మధ్యమ కుమారుడైన శునఃశేపుడు కలిపించుకుని 'నా తండ్రి పెద్ద కుమారుడిని ఇవ్వలేను అన్నాడు, నా తల్లి చిన్న కుమారుడిని ఇవ్వలేనని చెప్పింది, వీరిద్దరి మధ్యనున్న నన్ను గ్రహించండి రాజా!' అన్నాడు.

To be continued ........

No comments:

Post a Comment