Sunday 8 June 2014

గంగమ్మ గోడు వినండి

గంగా, గీత, గోవు భారతీయసంస్కృతిలో ప్రధానమైనవి. పూర్వం భగీరధుని తపస్సు వలన గంగ భూమికి వచ్చింది. తొలిసారిగా హరిద్వార్ ప్రాంతంలో జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ప్రవహించిన కారణంగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు పది రోజులపాటు వైభవంగా #గంగోత్సవం చేస్తారు.

గంగా అన్న పేరు వినడమే అదృష్టం. గంగలో స్నానం చేయాలని కోరుకోని వ్యక్తి ఉండడు. ప్రపచంలో గంగాజలం అద్బుతం, అత్యంత పవిత్రం, పావనం. గంగాజాలనికి ఉన్న ఔషధ గుణాలు మరే ఇతర నదీజలాలకు లేవని, గంగ ప్రపంచంలో ఒక అద్భుతమని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

'తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్' - గంగ నీరు త్రాగిన వారు పరమపదాన్ని పొందుతున్నారని శంకరులు గంగాస్తోతంలో వర్ణిచారు. శరీరానికి ముసలితనం వచ్చినప్పుడు, రకరాకల వ్యాధులు సోకినప్పుడు, ఇక ఏ దిక్కు లేక కాటికి సిద్ధమైనవాడికి గంగా జలం ఔషధం అవుతాయని, నారాయణుడే వైధ్యుడవుతాడని పెద్దల మాట. ఒక సన్యాసి కాశిలో ఉన్న సమయంలో ఒకతను, అతని ముసలితల్లిని తీసుకుని గంగాస్నానానికి వచ్చాడు. అతడి వివరాలు అడుగగా, తాను తన ముసలి తల్లిని వీపుపై మోసుకుంటూ 1000 మైళ్ళకు పైగా నడుస్తూ కాశీ చేరారని, జీవితంలో మరణించేలోపు
ఒక్కసారైన గంగా స్నానం చేయాలన్న తన కోరిక తీర్చడం తనకు సంతోషంగా ఉందని చెప్తాడు. గంగా స్నానం కోసం అంతగా తపించేవారు మన పూర్వీకులు. గంగ నీరు త్రాగితే యమభటులతో చర్చ ఉండదని భజగోవింద స్తోత్రం చెప్తోంది.

నదిని పూజించడమేంటన్న సందేహం కలగచ్చు. నది కేవలం ఒక జలప్రవాహం కాదు. అందులో జీవం ఉంది, శక్తి ఉంది, ఆ శక్తిని మన ఋషులు దర్శించారు. ఇప్పటికే అనేకమందితో గంగా నది అధిష్టాన దేవత అయిన గంగమ్మ కనిపించి మాట్లాడుతుంది. అడుగడునా పుణ్యక్షేత్రం, పవిత్ర స్థలం, గంగమ్మ ఎక్కడ ఉంటే అదే ఒక తీర్ధస్థలం. వేల కీలోమీటర్ల గంగాప్రవాహంలో ఎందరో అమ్మకు నీరాజనం పడతారు, అమ్మ కాన్పూర్ చేరేసరికి రకరకాల వ్యర్ధాలు కలుపుతారు, మురుగు కలుపుతారు. అయినా గంగమ్మ అన్నిటిని స్వీకరిస్తోంది. తనలో కలిపేసుకుటోంది. తొమ్మిది రాష్ట్రాలకు, దేశంలో సగం జనాభాకు ఆహారం ఇస్తోంది. కానీ మన గంగమ్మను కాలుష్యం కాటేసింది. భూతాపం భయపెడుతోంది.

జనానికి బంధముక్తిని కలిగించే గంగమ్మకు ఈ రోజు కాలుష్యం నుంచి విముక్తి కలగించవలసిన ధౌర్భాగ్యం పట్టింది. పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పులు గంగ ఎండిపోవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. గంగమ్మలో గుండెల్లో ఇసుకుమాఫియా అమ్మ రక్తాన్ని తాగేస్తోంది. గంగానది శుద్ధి కోసం, ఇసుకుమాఫియా చెర నుంచి అమ్మను విడిపించడం కోసం, గంగలో పెట్టిన స్టోన్ క్రషర్లను నిషేధించడం కోసం  స్వామి నిగమానంద సరస్వతీ ఆమరణ నిరహార దీక్ష చేయగా, 68 రోజులు దీక్ష తరువాత కొందరు దుండగులు ఆయనకు ఇంఫెక్షన్ అంటించి హతమార్చారు.

గంగను కాపాడుకోకపోతే మన జీవితం వృధా. ఆపదలో ఉన్న అమ్మను రక్షించలేని బిడ్డలను ఏ దేవుడు దీవిస్తాడు. గంగమ్మ గోడు వినండి, అమ్మను దర్శించండి, స్నానం ఆచరించండి, రక్షించండి, తరించండి.

జై గంగా మాతా              

No comments:

Post a Comment