Tuesday 10 June 2014

హిందూ ధర్మం - 79 (దేవర్షిగా మారిన విశ్వామిత్రుడు)

ఆమెను చూసి మోహితుడైన విశ్వామిత్రుడు, ఆమె దగ్గరకు వెళ్ళి 'ఓ అప్సరస! నీకు స్వాగతం. నా ఆశ్రమానికి విచ్చేసి, నన్ను అనుగ్రహించ్గు, నీ చేత మోహితుడైనాను, నీకు శుభమగుగాకా' అన్నాడు. ఆ మాటలు విన్న మేనక అక్కడే అగిపోయింది. ఇద్దరూ కలిసి పది సంవత్సరాలు ఉన్నారు. ఇది విశ్వామిత్రుని తపస్సుకు ఆటంకంగా మారింది. పదిఏళ్ళ తరువాత విశ్వామిత్రునికి తాను చేస్తున్నపని తప్పని గ్రహించి, చింతించి, శోకించడం మొదలుపెట్టాడు. ఆ బాధా నుంచి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. 'గొప్ప తపస్సు చేస్తున్న నన్ను ప్రక్కదారి పట్టించడానికి దేవతల పన్నిన పన్నాగం ఇది. పదేళ్ళు ఒక రాత్రిపగులులా గడిచిపోయాయి. నేను ఈ కామాన్ని, మోహాన్ని అధిగమించాలి. ఇవి నా తపస్సుకు ఆటంకాలుగా ఉన్నాయి' అని భావించాడు. పశ్చాత్తాపపడుతున్న విశ్వామిత్రుడు దీనికి కారణం మేనకనే అని ఆమె వైపు చూశాడు. విశ్వామిత్రుడు ఎక్కడ శపిస్తాడో అని మేనక వణికిపోతోంది. చేతులో జోడించి విశ్వామిత్రునకు నమస్కరించింది. ఆమె భయపడుతోదని గమనించి, అలాగో ఇప్పటికే తపోశక్తి వృధా చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ శపించి మరింతగా వృధా చేసుకోవడం ఎందుకని, ఆమెతో మధురంగా మాట్లాడి పంపించేశాడు. తాను ఉత్తర దిశగా హిమాలయాలకు పయనమయ్యాడు.

కౌశికి నదీతీరానికి చేరుకుని తనలో ఉన్న కామాన్ని జయించడానికి, శాంతిని పొందడానికి ఘోరమైన తపస్సు చేశాడు. దాదాపు వేయొ సంవత్సరాల పాటు మాటల్లో వర్ణించలేనటువంటి తపస్సు చేశాడు. అది చూసిన దేవతలకు భయం వేసి, ఋషులతో కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళి, విశ్వామిత్రుడు చేసిన తపస్సుకు దేవర్షి స్థానానికి అర్హత పొందాడాని చెప్పారు. దేవతల సలహా మీద బ్రహ్మ విశ్వామిత్రుని చేరుకుని 'ఓ మహర్షి! నా ప్రియమైన నీకు స్వాగతం. నేను నీ తపస్సు చేత సంతోషించాను. నేను నిన్ను ఋషులలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అది విన్న విశ్వామిత్రుడు చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరు నన్ను దేవర్షికి బదులుగా బ్రహ్మర్షి అని పిలిచి ఉంటే, నేను విజితేంద్రియుడను (ఇంద్రియాలపై విజయం సాధించిన వాడు విజితేంద్రుయుడు) అయ్యేవాడిని అన్నాడు. దానికి బదులుగా బ్రహ్మ 'నీవు ఇంకా ఇంద్రియాలను పూర్తిగా జయించలేదు. దానికోసం ప్రయత్నించు' అని బ్రహ్మ స్వర్గలోకానికి పయనమయ్యాడు. బ్రహ్మదేవునితో పాటు వచ్చిన దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళగా, విశ్వామిత్రుడు ఇంకోసారి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. రెండు చేతులను పైకెత్తి, అటువంటి ఆధారంలేకుండా నిలబడి, గాలిని మాత్రమే తీసుకుంటూ, మరే ఇతర ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడు. ఎండాకాలంలో పంచాగ్నిహోత్రం మధ్య నిలుచుని (నాలుగు వైపుల పెద్దపెద్దగా మండే నాలుగు అగ్నిహోత్రాలు, పైన సూర్య్డు కలిపి ఐదు), వర్షాకాలంలో ఆకాశాన్ని పైకప్పుగా చేసుకుని (ఎటువంటి నీడా, పైకప్పు లేకుండా, వర్షానికి తడుస్తూ) తపస్సు చేశాడు. చలికాలం మొత్తం నీటిలో పడుకుని తపస్సు చేశాడు. ఈ విధమైన తపస్సు కొన్ని వేల సంవత్సరాల పాటు చేశాడు.

To be continued ...........

No comments:

Post a Comment