Friday 4 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (11)



మా ట . మ న్న న


తన స్వామి ఆదేశానుసారం సామీరి వారెవరో తెలుసుకొనుటకై కపి రూపమును వీడి బ్రహ్మచారిగ రామ, లక్ష్మణులను సమీపించి


ఆర్యులారా! మీరెవరు? ఏపనికై ఇటకేతెంచినారు? అనితర సాధ్యమైన మీ రూప బల సంపదలు చూస్తే ఉత్తమ క్షత్రియ సంజాతులవలె కన్నట్టుచున్నారు. వేషమందుమా - బ్రహ్మ తేజ ముట్టిపడు తాపసోత్తముల సైతము మరపించుచున్నది. వృషభ గమనంతో, ఇంద్రచాపమును బోలు ధనుస్సులను ధరించి సూర్య చంద్రులవలె వెలుగొందు మిమ్ము చూచి ప్రకృతి సౌందర్యంతో పులకించే అడవి జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. బంగరు కాంతులనీను ఖడ్గాలు బుసకొట్టు కోడెత్రాచులాగున్నాయి.


ఇంతకీ మీరెవరు? అని సరస సంభాషణా చతురుడు- స సందర్భ వాగ్బాణ నిపుణుడు- వాక్య కోవిదుడు అంజనాసూనుడు వారిని పలుకరించి ప్రశ్నించెను.


హనుమ ఎంతగా పలుకరించినా ఆ అన్నదమ్ములు పెదవి విప్పనే లేదు. వారిని అంతగా తన్మయులను చేసింది హనుమ ద్వాణి. వారి ఉపేవోభావము నుపేక్షింపక మరల తిరిగి అయ్యలారా! నేనింతదనుక మాటలాడినా మీరు స్పందించరదేమి? ఔను నిజమే. నేనెవరినో ముందుగా మీకు చెప్పనేలేదు కదా!


సుగ్రీవుడు వానర రాజు, ధర్మాత్ముడు. మహా వీరుడు. అన్నచే పరాభవింపబడి అడవుల పాలైనాడు. అతడు పంపగా మీ దగ్గరకు వచ్చాను. మీ స్నేహాన్ని కోరుచున్నాడు. అతని ఆంతరంగిక సచివులలో నేనొకడను. నన్ను హనుమంతుడని పిలుస్తారు. వాయు పుత్రుడను. కామరూప, కామగమన శక్తులు కలవాడను అని మనోహరంగా పలికినాడు.


No comments:

Post a Comment