Sunday 13 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (19)



సన్మార్గగాములేపుడూ స్వసుఖాన్ని తృణీకరించి మిత్ర కార్యం నెరవేరుదాకా విశ్రమించరు. కృతఘ్నుని సిరిసంపదలు వీడిపోవును. రాముడు మనకు మిత్రుడు. కాలవేత్త. బుద్ధిమంతుడు. ఇప్పటికే కాలాతీతమైనది.


తానుగా వచ్చి మాత్రం కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. సమయా నికి తగినరీతిగా ప్రవర్తించనివాడు మిత్రుడే కాదు, నీకోసం వాలి ప్రాణాలు తీయటానికైనా వెనుకాడలేదుకదా రాముడు! మరి నీకి జాగేల కనుసైగ చేస్తే నీముందు వేనవేల వానర, భల్లూక వీరులు వచ్చి వాలుదురే? సమయం దాటిన తరువాత చేసిన కార్యం ఎంత మహత్తరమైనదైనా మిత్రున కుపకరించునా? కాన ఓరాజా! వెంటనే వానర, భల్లూకవీరులను సీతాన్వేషణకై తరలి రావలసినదిగా ఆజ్ఞాపించు, రాముడే అలిగిననాడు సముద్రము లింకకుండునా! యక్ష, గంధర్వ, దేవ, దానవులు గుండియలదరి ఆదరి ఆగకుండునా అని కాలానుగుణంగా చేసిన ప్రబోధానికి ఒకింత భయం, ఒకింత ఆంజనేయునిపై అభిమానం పెరగగా సుగ్రీవుడు కపిసేనను ఎటనున్నా పదిహేను రోజులలో చేరుకోవాలనీ, లేనినాడు శిరచ్ఛేదమే శిక్ష అని ఆజ్ఞాపించాడు.


మతియ కళా కృషి బీజము


ప్రస్రవణ గిరిమీద క్షణమొక యుగముగా గడుపుతున్న రామునకు వర్షాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చి ప్రకృతి- యుద్ధానికి తగినవిధంగా మారినా పూర్వం కుదుర్చుకున్న స్నేహ ఒప్పందం ప్రకారం ఇంకను సుగ్రీవుడు రాడాయె ఓర్పు రామునిలో నశించింది. తమ్ముడు లక్ష్మణునితో- "లక్ష్మణా! సుగ్రీవుడు విషయలోలుడై గతాన్ని మరచినట్లున్నాడు. ఒకసారి నీవు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుని హెచ్చరించు. సుగ్రీవా! ఇప్పటివరకు రాముని అనుగ్రహాన్నే చూచావు. ఇక ఇపుడు ఆగ్రహాన్ని చూడ బోతున్నావు? వాలి వెళ్ళినదారిన పయనించాలనుకోకు?”,


సహజ శాంతస్వభావుడైన లక్ష్మణుడు అన్నగారి మాటలకు తనువు కంపింపగా ధనుర్బాణపాణియై పిడుగుల గర్జనను బోలిన అడుగులతో కిష్కింధలో కాలిడెను. ప్రళయకాల రుద్రునిలా నున్న రామానుజుని చూచి కపులు గడగడలాడిరి. 

No comments:

Post a Comment