Tuesday 1 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (8)



కార్యార్థులై అవతరించిన దేవతామూర్తులు కూడా గురూప దిష్టులే సామాన్య మానవునిలా ప్రవర్తించుట గురువు యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటుటకే !


విద్యాభ్యాసానికి ఏకాగ్రత, పట్టుదల, ఆసక్తి, శ్రద్ధ- అవసరాలు. 'విద్యావినయేన శోభతే కదా! ఆనాటి గురుకుల విద్యా భ్యాసాలు గమనించిన ఎంతటి కఠోరమైనవో గమనించవచ్చు. మరి యీనాటి విద్యార్థులు తమ ముంగిటికే నచ్చి విద్యాబోధన చేయుచున్నా పాఠ్యేతరాంశాల మీదున్న శ్రద్ధ వారికి విద్యార్జనలో ఏ మాత్రం లేకపోవుట కడు శోచనీయం అట్టివారికి ఎంతో కఠినమైన అంజనేయుని విద్యాభ్యాసం కర్తవ్యదీక్షను గుర్తు చేస్తుంది.


ఆంజనేయుడు . సన్మిత్రుడు


వానరరాజైన ఋక్షరజనునకు వాలి, సుగ్రీవులు కుమారులు. తండ్రి మరణానంతరం పెద్దవాడైన వాలి రాజు కాగా, సుగ్రీవుడు యువరాజు. ఈ యువరాజుకు స్నేహితుడు ఆంజనేయుడు. వాలి సుగ్రీవునిపై అకారణ వైరము పూని తరిమినపుడు ఆంజనేయుడు సుగ్రీవుని వెంట కొండ కోనలలో తిరుగాడుచు ఒకనాడు తన చెలికాడైన సుగ్రీవునితో.


“ఓ రాజా! దుందుభి అను రాక్షసుడు అమిత శక్తి శాలి. అతడొకనాడు మహిష వేషధారియై వాలిని యుద్ధము చేయ రమ్మని సవాలు చేసెను. వాలి క్రోధావేశుడై దుందుభి నెదుర్కొనెను. పోరు ఘోరముగ సాగెను. మహావీరుడైన వాలి పిడికిలి పోట్లతో, కాలి తాపులతో, రాళ్ళు విసిరి, చెట్లు పెకలించి కొట్టగా- బలమైన ఆ దెబ్బలకు దుందుభి ప్రాణాలు అనంత వాయువులలో లీనమైనవి. ఆవేశపూరితుడైన వాలి దుందుఖి కాయాన్ని రెండు చేతులు పైకెత్తి గిర గిర త్రిప్పి విసరివైవెను. అది పోయి పోయి మతంగ ముని ఆశ్రమాన పడి అందుండి రక్తబిందువులు ఎగిరి అమ్మునిపైపడగా పరికించి చూడగా మందుభి కాయం మతంగునికి కన్పించెను. దూర దృష్టితో తేరిపార చూచిన మతంగ మహాముని పరిస్థితిని గమనించి "ఈ అకృత్యమునకు పాల్పడినదెవరో. అతడు యీ ఆశ్రమం ప్రవేశించిన వాని శిరసు శతధా ఛిన్నమగును" అని శపించెను.


No comments:

Post a Comment