Wednesday 9 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (16)



అదే ధీ వైభవం అంటే, సమయానికి స్ఫురించని బుద్ధి విశేషం చచ్చుబడిన చేయివంటిది.


ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధ జితేంద్రియా 

ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతాః.


ఇటువంటి బుద్ధి సంపన్నులు, జితక్రోధులు, జితేంద్రియులు నైనవారిని సుగ్రీవుడు స్వయముగా వచ్చి దర్శించుకో వలసివుండగా-వారే వచ్చి సుగ్రీవుని చూడవచ్చుట సుగ్రీవుని దెంత అదృష్టమో కదా !


వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి సుగ్రీవునియెడ అకారణ వైరమూని రాజ్యభ్రష్టుని చేయుటయే కాక భార్య రుమను కూడ చేపట్టినాడు. దిక్కుదోచని స్థితిలో సుగ్రీవుడు కానల వెంబడి తిరుగుచున్నాడు. వాలి వధించునను భయంతో మీరంగీకరించిన మా ప్రభు సన్నిధికి తీసుకుపోతాను అని వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చి - రాముని సుగ్రీవునకు పరిచయం చేసిన విధానం నీతి మంతమూ, ఆలోచనాయుతమూ, ఆదర్శవంతమూ-ఐనట్టిది.


ఈనాడు ఒక రాష్ట్రం మరో రాష్ట్రం, ఒక దేశం మరో దేశం ఆకారణ అసూయా రాగద్వేషాలతో, కక్షలూ కార్పణ్యాలతో కుహనా రాజకీయాలతో సమాజ అభ్యున్నతి, దేశపురోగతి కుంటు పడే ప్రమాదం క్షణక్షణం పొంచి వుంది. ఇటువంటి పరిస్థితులలో ఆలోచనాపరులు, రాయబారులు, సంధానకర్తలు - మొదలగు పరిష్కర్తలకు రామాయణ సన్నివేశాలలో హనుమంతుడు నెరపిన రాజనీతి, కార్యసాధనకు అతడు ఉపయోగించిన మేధాశక్తి, సమయ సందర్భములనెరిగి తనంత తాను తీసుకున్న నిర్ణయాలు-ఏ కాలము నాడు జరిగినవో - అయినా నేటికీ అనుసరించదగినవి. విభిన్న ప్రవృత్తులుగల నర, వానరులకే అంతటి సఖ్యత నొనగూర్చిన ఆంజనేయుని దీర్ఘ దర్శిత్వం అందరూ అవశ్యం ఆచరింపతగినవి. 'వసుధైక కుటుంబకం' అను సూక్తికి నిదర్శనమైనవి. చూడండి.


No comments:

Post a Comment